టాలీవుడ్ లో నటుడిగా కెరీర్ మొదలపెట్టినప్పటికీ.. బాలీవుడ్ లో మంచి కాంటాక్ట్స్ సంపాదించగలిగారు రానా దగ్గుబాటి. అక్కడ టాప్ ప్రొడక్షన్ హౌస్ లతో . అలానే ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ఛానెల్స్ తో రానాకి పరిచయాలు ఉన్నాయి. తన సినిమాల ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్న రానా ఇప్పుడు డిజిటల్ ఇండస్ట్రీలో రాణించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఓటీటీ యాప్స్ కోసం సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు ఆ కంటెంట్ ను ప్రముఖ ఓటీటీ సంస్థలో రిలీజ్ చేసే దిశగా రానా మంతనాలు షురూ చేశారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నెట్ ఫ్లిక్స్ తో డీలింగ్ కుదుర్చుకొని ప్రత్యేకంగా కొన్ని వెబ్ ఫిలిమ్స్ ను, సిరీస్ ను అందులోనే రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు రానా కూడా కరణ్ ను ఫాలో అవ్వాలనుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా వెబ్ సిరీస్ లను, సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.
రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ కు అమ్మేశారని.. ఈ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి పని చేయాలనే ఆలోచనతోనే తన సినిమాను కూడా ఇలా డిజిటల్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి రానా ప్రపోజల్ ను నెట్ ఫ్లిక్స్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి!
This post was last modified on July 2, 2021 1:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…