టాలీవుడ్ లో నటుడిగా కెరీర్ మొదలపెట్టినప్పటికీ.. బాలీవుడ్ లో మంచి కాంటాక్ట్స్ సంపాదించగలిగారు రానా దగ్గుబాటి. అక్కడ టాప్ ప్రొడక్షన్ హౌస్ లతో . అలానే ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ఛానెల్స్ తో రానాకి పరిచయాలు ఉన్నాయి. తన సినిమాల ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్న రానా ఇప్పుడు డిజిటల్ ఇండస్ట్రీలో రాణించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఓటీటీ యాప్స్ కోసం సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు ఆ కంటెంట్ ను ప్రముఖ ఓటీటీ సంస్థలో రిలీజ్ చేసే దిశగా రానా మంతనాలు షురూ చేశారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నెట్ ఫ్లిక్స్ తో డీలింగ్ కుదుర్చుకొని ప్రత్యేకంగా కొన్ని వెబ్ ఫిలిమ్స్ ను, సిరీస్ ను అందులోనే రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు రానా కూడా కరణ్ ను ఫాలో అవ్వాలనుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా వెబ్ సిరీస్ లను, సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.
రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ కు అమ్మేశారని.. ఈ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి పని చేయాలనే ఆలోచనతోనే తన సినిమాను కూడా ఇలా డిజిటల్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి రానా ప్రపోజల్ ను నెట్ ఫ్లిక్స్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి!
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…