Movie News

డ్యాన్స్ మాస్టర్.. హార్రర్ డైరెక్టర్

ఒకప్పుడంటే డ్యాన్స్ మాస్టర్లు కేవలం నృత్య దర్శకత్వానికే పరిమితం అయ్యేవాళ్లు. కానీ తర్వాతి తరం మాస్టర్లు మాత్రం తమలోని వేరే కళల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాఘవ లారెన్స్ నటుడిగానే కాక దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా సైతం నటుడిగా, దర్శకుడిగా మెరిశాడు. ఈ జాబితాలో మరింత మంది కనిపిస్తారు.
ఇప్పుడు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లలో ఒకడైన జానీ హీరోగా సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనదైన శైలిలో పాటలకు నృత్య రీతులు సమకూర్చి.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డ్యాన్స్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ హీరోగా ఓ సినిమా మొదలైంది. ఇప్పుడు అతను ప్రధాన పాత్రలో మరో సినిమాను ప్రకటించడం విశేషం. ఆ చిత్రాన్ని కాస్త పేరున్న దర్శకుడే రూపొందించబోతున్నాడు.

14 ఏళ్ల కిందట ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార్రర్ మూవీ ‘మంత్ర’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రాన్ని రూపొందించి ఓషో తులసీరామ్. అతడికది దర్శకుడిగా తొలి చిత్రం. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి కూడా కనిపించినప్పటికీ ఈ సినిమాతో అతను ప్రతిభ చాలుకున్నాడు. దీని తర్వాత కొన్నేళ్లకు ఛార్మినే పెట్టి ‘మంగళ’ అనే మరో హార్రర్ మూవీ తీశాడు. కానీ అది నిరాశ పరిచింది. మళ్లీ తులసీరామ్ కనిపించకుండా పోయాడు. ఇన్నేళ్లకు మళ్లీ అతను మెగా ఫోన్ పడుతున్నాడు.

జానీ మాస్టర్ హీరోగా అతను తన మూడో చిత్రాన్ని ప్రకటించడం విశేషం. ఈ సినిమాకు ‘దక్షిణ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అట. ఇలాంటి సినిమాలో జానీ మాస్టర్ హీరోగా నటించడం కొంచెం చిత్రంగా అనిపించే విషయమే. అరకు, గోవా, బెంగళూరు, తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరపనున్నారట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

This post was last modified on July 2, 2021 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

3 hours ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

5 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

5 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

8 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

8 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

9 hours ago