టాలీవుడ్ లో ఉన్న గొప్ప రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న రైటర్స్ లో విజయేంద్రప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. తన కొడుకు రాజమౌళి సినిమాలకు కథలు రాయడంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లలో భారీ బడ్జెట్ సినిమాలకు కథలు అందిస్తున్నారు. ప్రస్తుతం ‘సీత’, ‘తలైవి’ అనే సినిమాలకు రచయితగా పని చేస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే తదుపరి సినిమాకి కూడా కథ సిద్ధం చేశారు విజయేంద్రప్రసాద్.
ఇదిలా ఉండగా.. మొదటిసారి విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రాసుకున్నారట. ఈ స్టార్ రైటర్ కి పవన్ కళ్యాణ్ మీద ఎంతో అభిమానం ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా పవన్ ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ స్టార్ ఇంకెవరు లేరని అంటుంటారు విజియేంద్రప్రసాద్. పవన్ పర్సనల్ క్యారెక్టర్ అంటే కూడా చాలా ఇష్టమని చెబుతుంటారు.
ఇప్పుడు పవన్ మీద ఉన్న అభిమానంతోనే ఓ కథ రాసుకొని ఆయనకి వినిపించారట. అది విన్న పవన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారు..? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఓ పక్క అయ్యప్పన్ రీమేక్ లో నటిస్తూనే మరోపక్క ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత హరీష్ శంకర్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో విజియేంద్ర ప్రసాద్ సినిమా కూడా చేరిందని అంటున్నారు.
This post was last modified on July 2, 2021 11:00 am
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…