టాలీవుడ్ లో ఉన్న గొప్ప రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న రైటర్స్ లో విజయేంద్రప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. తన కొడుకు రాజమౌళి సినిమాలకు కథలు రాయడంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లలో భారీ బడ్జెట్ సినిమాలకు కథలు అందిస్తున్నారు. ప్రస్తుతం ‘సీత’, ‘తలైవి’ అనే సినిమాలకు రచయితగా పని చేస్తున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే తదుపరి సినిమాకి కూడా కథ సిద్ధం చేశారు విజయేంద్రప్రసాద్.
ఇదిలా ఉండగా.. మొదటిసారి విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రాసుకున్నారట. ఈ స్టార్ రైటర్ కి పవన్ కళ్యాణ్ మీద ఎంతో అభిమానం ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా పవన్ ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ స్టార్ ఇంకెవరు లేరని అంటుంటారు విజియేంద్రప్రసాద్. పవన్ పర్సనల్ క్యారెక్టర్ అంటే కూడా చాలా ఇష్టమని చెబుతుంటారు.
ఇప్పుడు పవన్ మీద ఉన్న అభిమానంతోనే ఓ కథ రాసుకొని ఆయనకి వినిపించారట. అది విన్న పవన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారు..? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఓ పక్క అయ్యప్పన్ రీమేక్ లో నటిస్తూనే మరోపక్క ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత హరీష్ శంకర్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో విజియేంద్ర ప్రసాద్ సినిమా కూడా చేరిందని అంటున్నారు.
This post was last modified on July 2, 2021 11:00 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…