Movie News

‘ఆహా’ ఓటీటీ దూకుడు

గత ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా ‘ఆహా’ పేరుతో ఓటీటీ మొదలుపెట్టి ఆశ్చర్యానికి గురి చేశారు అల్లు అరవింద్. ఓటీటీ అంటే చాలా పెద్ద వ్యవహారం అని.. వందల కోట్లు చేతిలో పెట్టుకుని రంగంలోకి దిగాల్సిందే అని.. ప్రాంతీయ భాషలో పరిమిత బడ్జెట్లో ఓటీటీని మొదలుపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని అంతా అనుకున్నారు. ఐతే ఏం చేసినా పక్కా ప్రణాళికలతో, దూర దృష్టితో చేసే అరవింద్.. ఓటీటీ విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

సొంతంగా నిర్మించిన సినిమాలకు తోడు.. కొత్తగా కొన్ని చిన్న సినిమాలను కొనుగోలు చేసి చిన్న స్థాయిలోనే ‘ఆహా’ను మొదలుపెట్టి.. ఆ తర్వాత నెమ్మదిగా కంటెంట్ పెంచుతూ పోయారు. ముందు ఆహాను లైట్ తీసుకున్న వాళ్లు కూడా ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ తీసుకునే పరిస్థితి కల్పించారు. తెలుగు కంటెంట్‌కు తోడు ఇతర భాషల చిత్రాలను తక్కువకు కొనుగోలు చేసి డబ్ చేసి రిలీజ్ చేయడం ద్వారా ‘ఆహా’ కోసం పెట్టే డబ్బులు గిట్టుబాటయ్యేలా చూశారు.

ఈ మధ్యన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంఖ్య కూడా బాగా పెరిగింది ఆహాలో. కొత్త కంటెంట్‌కు తోడు పాత క్లాసిక్స్‌ను కూడా ఎప్పటికప్పుడు ఆహాలోకి తెస్తోంది దాని టీం. తాజాగా ఆహాలోకి రాబోతున్న 14 చిత్రాలను ప్రకటించారు. అవేమీ కొత్త సినిమాలు కాదు. పాతవే. కానీ అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే క్లాసిక్స్ ఉన్నాయి. భైరవద్వీపం, చిరునవ్వుతో, రాజేంద్రుడు గజేంద్రుడు, వినోదం, ఈగ, బంగారు బుల్లోడు, ఊహలు గుసగుసలాడే, కొబ్బరి బొండాం, ఘటోత్కచుడు, అందాల రాక్షసి, దిక్కులు చూడకు రామయ్యా లాంటి మంచి సినిమాలున్నాయి అందులో. ఇవి కాక యుద్ధం శరణం, వేటగాడు, లీసా, లాంటి సినిమాలు కూడా ఆహాలోకి రానున్నాయి. ఓవైపు కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు పెద్ద ఎత్తున తీసుకొస్తూ.. ఇలా పాత క్లాసిక్స్‌ను జోడించడం ద్వారా ఉన్న సబ్‌స్క్రైబర్లను నిలబెట్టుకోవడంతో పాటు కొత్త వాళ్లను కూడా బాగానే ఆకర్షిస్తోంది ఆహా.

This post was last modified on July 1, 2021 10:10 pm

Share

Recent Posts

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

2 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

12 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

13 hours ago