అల్లు అర్జున్ హీరోగా ఎప్పుడో మూడేళ్ల కిందట ప్రకటించిన చిత్రం ‘ఐకాన్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం అయిపోయింది. ఒక దశలో ఈ మూవీ క్యాన్సిల్ అయిపోయిందేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. ముందు ప్రకటించిన దీన్ని పక్కన పెట్టి త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి.. ఆ తర్వాత ‘పుష్ప’ మీదికి వెళ్లిపోయాడు బన్నీ.
వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’తో సత్తా చాటుకున్నాక కూడా బన్నీలో పెద్దగా కదలిక కనిపించలేదు. ‘ఐకాన్’ కథను మరో హీరోతో చేయడానికి వేణు రెడీ అయిపోయినట్లు కూడా వార్తలు రావడం తెలిసిందే. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. ఇంకో మూడు నెలల్లో ఈ సినిమా మొదలవుతుందట.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ పార్ట్-1ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జులై 5న కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. 20 రోజుల చొప్పున రెండు షెడ్యూళ్లు.. మొత్తంగా 40 రోజులు చిత్రీకరణ జరపనున్నారట. అంతటితో పార్ట్-1 షూటింగ్ అయిపోతుందని సమాచారం. ‘ఐకాన్’ కోసమని బన్నీ.. సుకుమార్ను మూడు నెలలు సమయం అడిగినట్లు సమాచారం. అందుకు సుక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మూడు నెలలన్నప్పటికీ నాలుగైదు నెలలు ‘ఐకాన్’ కోసం కేటాయించే అవకాశముందని.. ఈ లోపు ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ను రిలీజ్కు రెడీ చేయడం.. ఆ సినిమా విడుదల కావడం.. ఆపై సెకండ్ పార్ట్కు సంబంధించి స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకుని, ప్రి ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది.
ప్రస్తుతానికి ‘పుష్ప’ పార్ట్-1ను దసరాకు అనుకుంటున్నారు. లేదంటే వీలును బట్టి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. ‘ఐకాన్’ సినిమాను బన్నీ ఈ ఏఢాది చివరికి పూర్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ‘పుష్ప’ పార్ట్-2 షూటింగ్ వచ్చే వేసవిలో మొదలై సినిమా ఆ తర్వాత ఏడాది ఆరంభంలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on July 1, 2021 2:55 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…