అల్లు అర్జున్ హీరోగా ఎప్పుడో మూడేళ్ల కిందట ప్రకటించిన చిత్రం ‘ఐకాన్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం అయిపోయింది. ఒక దశలో ఈ మూవీ క్యాన్సిల్ అయిపోయిందేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. ముందు ప్రకటించిన దీన్ని పక్కన పెట్టి త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి.. ఆ తర్వాత ‘పుష్ప’ మీదికి వెళ్లిపోయాడు బన్నీ.
వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’తో సత్తా చాటుకున్నాక కూడా బన్నీలో పెద్దగా కదలిక కనిపించలేదు. ‘ఐకాన్’ కథను మరో హీరోతో చేయడానికి వేణు రెడీ అయిపోయినట్లు కూడా వార్తలు రావడం తెలిసిందే. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. ఇంకో మూడు నెలల్లో ఈ సినిమా మొదలవుతుందట.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ పార్ట్-1ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జులై 5న కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. 20 రోజుల చొప్పున రెండు షెడ్యూళ్లు.. మొత్తంగా 40 రోజులు చిత్రీకరణ జరపనున్నారట. అంతటితో పార్ట్-1 షూటింగ్ అయిపోతుందని సమాచారం. ‘ఐకాన్’ కోసమని బన్నీ.. సుకుమార్ను మూడు నెలలు సమయం అడిగినట్లు సమాచారం. అందుకు సుక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మూడు నెలలన్నప్పటికీ నాలుగైదు నెలలు ‘ఐకాన్’ కోసం కేటాయించే అవకాశముందని.. ఈ లోపు ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ను రిలీజ్కు రెడీ చేయడం.. ఆ సినిమా విడుదల కావడం.. ఆపై సెకండ్ పార్ట్కు సంబంధించి స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకుని, ప్రి ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది.
ప్రస్తుతానికి ‘పుష్ప’ పార్ట్-1ను దసరాకు అనుకుంటున్నారు. లేదంటే వీలును బట్టి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారు. ‘ఐకాన్’ సినిమాను బన్నీ ఈ ఏఢాది చివరికి పూర్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ‘పుష్ప’ పార్ట్-2 షూటింగ్ వచ్చే వేసవిలో మొదలై సినిమా ఆ తర్వాత ఏడాది ఆరంభంలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on July 1, 2021 2:55 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…