Movie News

అఖిల్ తో మైత్రి ప్లాన్ ఇదే!

స్టార్ కిడ్ అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. అందులో ఏదీ కూడా అఖిల్ కి భారీ సక్సెస్ ను తీసుకురాలేదు. దీంతో తన సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది.

పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. అనీల్ సుముఖ నిర్మిస్తోన్న ఈ సినిమా జూలైలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే ఇప్పుడు అఖిల్ మరో సినిమా ఒప్పుకున్నాడని సమాచారం. టాలీవుడ్ హీరోలతో వరుస ప్రాజెక్ట్ లను చేపడుతున్న మైత్రి మూవీస్ సంస్థ గతంలో అఖిల్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీనువైట్ల వ్యవహరించబోతున్నారని సమాచారం. అఖిల్ కి సరిపడా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసుకున్న శ్రీనువైట్ల మైత్రి సంస్థకు తన స్క్రిప్ట్ ను వినిపించాడు. త్వరలోనే అఖిల్ ని కలిసి నేరేషన్ ఇస్తారట. అఖిల్ కి కూడా కథ నచ్చితే వచ్చే ఏడాదిలో ఈ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల ‘ఢీ అండ్ ఢీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు.

This post was last modified on June 30, 2021 2:29 pm

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

29 minutes ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

1 hour ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

1 hour ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

1 hour ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

2 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

2 hours ago