స్టార్ కిడ్ అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. అందులో ఏదీ కూడా అఖిల్ కి భారీ సక్సెస్ ను తీసుకురాలేదు. దీంతో తన సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది.
పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. అనీల్ సుముఖ నిర్మిస్తోన్న ఈ సినిమా జూలైలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే ఇప్పుడు అఖిల్ మరో సినిమా ఒప్పుకున్నాడని సమాచారం. టాలీవుడ్ హీరోలతో వరుస ప్రాజెక్ట్ లను చేపడుతున్న మైత్రి మూవీస్ సంస్థ గతంలో అఖిల్ కి భారీ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది.
ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీనువైట్ల వ్యవహరించబోతున్నారని సమాచారం. అఖిల్ కి సరిపడా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసుకున్న శ్రీనువైట్ల మైత్రి సంస్థకు తన స్క్రిప్ట్ ను వినిపించాడు. త్వరలోనే అఖిల్ ని కలిసి నేరేషన్ ఇస్తారట. అఖిల్ కి కూడా కథ నచ్చితే వచ్చే ఏడాదిలో ఈ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల ‘ఢీ అండ్ ఢీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు.
This post was last modified on June 30, 2021 2:29 pm
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…