మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కేవలం 900 మంది సభ్యులకు పరిమితమైన వ్యవహారం. కానీ దీని చుట్టూ జరిగే హడావుడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా గత రెండు పర్యాయాలు మా ఎన్నికలు ఎంతగా చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఈసారి అంతకుమించిన రచ్చ ఖాయంగా కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. వీరికి తోడు జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్లు అధ్యక్ష పదవికి పోటీ చేస్తామంటున్నారు.
ఐతే ప్రధానంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యే పోటీ కేంద్రీకృతం అవుతుందని భావిస్తున్నారు. వీరికి ఎవరెవరు మద్దతునిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వీరి కోసం పరిశ్రమ రెండుగా చీలిపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
ఐతే మా ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఎవరికి మద్దతిస్తే వాళ్లే విజేతగా నిలుస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీపై ఆయనకున్న పట్టు.. పరిశ్రమలో ఆయనకున్న పలుకుబడి అలాంటిది మరి. ఐతే ఆయన ఓపెన్గా మాత్రం ఎవరికీ మద్దతిచ్చే పరిస్థితి లేదు. తెరవెనుక మంత్రాంగం నడిపించే అవకాశముంది. ఐతే చిరు సోదరుడు నాగబాబు బహిరంగంగా ప్రకాష్ రాజ్కు మద్దతివ్వడంతో పాటు ఆయనకు చిరు సపోర్ట్ ఉందని ప్రకటించడం గమనార్హం.
అదే సమయంలో మోహన్ బాబు తనయుడైన మంచు విష్ణు రంగంలోకి దిగుతుండటంతో చిరు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మంచి మిత్రులైన వీళ్లిద్దరికీ మధ్యలో కొన్ని అంతరాలు వచ్చాయి. వజ్రోత్సవాల గొడవ, చిరుకు పద్మభూషణ్ ప్రకటించినపుడు తలెత్తిన వివాదం ఇద్దరి మధ్య గ్యాప్ పెంచాయి. ఈ అగాథాన్ని పూరించుకుని కొన్నేళ్లుగా ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. గత రెండేళ్లలో వివిధ సందర్భాల్లో ఇద్దరూ సన్నిహితంగా మెలగడం చూశాం. ఇలాంటి టైంలో ఇప్పుడు మా ఎన్నికలు ఈ ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు పెడతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిరు బహిరంగంగా ప్రకాష్ రాజ్కు మద్దతు ఇవ్వకపోయినా.. పరోక్షంగా ఆయనకు సాయం చేస్తే, విజయానికి కృషి చేస్తే అది మోహన్ బాబుకు తెలియకుండా ఉండదు. అదే జరిగితే మరోసారి చిరుకు, మోహన్ బాబుకు మధ్య గ్యాప్ రావడం ఖాయం.
This post was last modified on June 29, 2021 9:04 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…