ముందుగా మలయాళంలో ఘనవిజయం సాధించి.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళ, చైనీస్ భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా సూపర్ హిట్ అయిన సినిమా దృశ్యం. ఈ యూనివర్శల్ హిట్కు సీక్వెల్గా మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం-2 కొన్ని నెలల కిందటే విడుదలై అద్భుతమైన స్పందన రాబట్టుకున్న సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని రోజులకే దీని తెలుగు రీమేక్ను మొదలుపెట్టేశారు. చాలా తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేశారు.
ఇప్పుడిక దర్శకుడు జీతు జోసెఫ్ తమిళ రీమేక్కు సన్నాహాలు చేసుకుంటున్నాడు. దృశ్యం రీమేక్ పాపనాశంలో కథానాయకుడిగా నటించిన కమల్ హాసన్తోనే సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆయనకు జోడీగా గౌతమి నటించే అవకాశాల్లేవు. వీళ్లిద్దరూ విడిపోయి దూరం అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయడానికి ఆస్కారం లేకపోయింది.
మలయాళం, తమిళ భాషల్లో టనించిన మీనానే.. కమల్కు జోడీగా పెడతారని ముందు వార్తలొచ్చాయి. కానీ ప్రతి భాషలోనూ మీనానే అయితే బాగుండదని.. వేరే మిడిలేజ్డ్ హీరోయిన్నే ఆ పాత్రకు ఎంచుకుందామని చూస్తున్నారట. తాజాగా ఈ పాత్రకు సీనియర్ నటి నదియా పేరు వినిపిస్తోంది. నిజానికి పాపనాశంలోనే నదియాను కమల్కు జోడీగా నటింపజేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు దృశ్యం-2కు ఆమె దాదాపుగా కమల్కు జోడీగా ఖరారైనట్లుగా చెబుతున్నారు.
విశేషం ఏంటంటే.. తెలుగు దృశ్యం, దృశ్యం-2ల్లో నదియా నటించింది. హీరో చేతిలో హత్యకు గురయ్యే అబ్బాయికి తల్లిగా ఆమె కనిపిస్తుంది. ఐతే మలయాళంలో ఆ పాత్రను చేసిన ఆశా శరతే.. తమిళంలోనూ నటించింది. పాపనాశం-2లోనూ ఆమెను అలాగే కొనసాగించనున్నారు. తెలుగులో ఆశా పాత్రను చేసిన నదియాను తమిళంలో హీరోకు జోడీగా చూపించబోతున్నారంటే ఇదొక చిత్రమైన విషయమే.
This post was last modified on June 28, 2021 5:51 am
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…