Movie News

తెలుగు దృశ్యం-2లో ఇలా.. త‌మిళ దృశ్యం-2లో అలా

ముందుగా మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించి.. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, సింహ‌ళ‌, చైనీస్ భాష‌ల్లో రీమేక్ అయి అన్ని చోట్లా సూప‌ర్ హిట్ అయిన సినిమా దృశ్యం. ఈ యూనివ‌ర్శ‌ల్ హిట్‌కు సీక్వెల్‌గా మ‌ల‌యాళంలో తెరకెక్కించిన దృశ్యం-2 కొన్ని నెల‌ల కింద‌టే విడుద‌లై అద్భుత‌మైన స్పంద‌న రాబ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత కొన్ని రోజుల‌కే దీని తెలుగు రీమేక్‌ను మొద‌లుపెట్టేశారు. చాలా త‌క్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేసేశారు.

ఇప్పుడిక ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ త‌మిళ రీమేక్‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. దృశ్యం రీమేక్ పాప‌నాశంలో క‌థానాయకుడిగా న‌టించిన క‌మ‌ల్ హాస‌న్‌తోనే సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆయ‌న‌కు జోడీగా గౌత‌మి న‌టించే అవ‌కాశాల్లేవు. వీళ్లిద్ద‌రూ విడిపోయి దూరం అయిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసి సినిమా చేయ‌డానికి ఆస్కారం లేక‌పోయింది.

మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో ట‌నించిన మీనానే.. క‌మ‌ల్‌కు జోడీగా పెడ‌తార‌ని ముందు వార్త‌లొచ్చాయి. కానీ ప్ర‌తి భాష‌లోనూ మీనానే అయితే బాగుండ‌ద‌ని.. వేరే మిడిలేజ్డ్ హీరోయిన్నే ఆ పాత్ర‌కు ఎంచుకుందామ‌ని చూస్తున్నార‌ట‌. తాజాగా ఈ పాత్ర‌కు సీనియ‌ర్ న‌టి న‌దియా పేరు వినిపిస్తోంది. నిజానికి పాప‌నాశంలోనే నదియాను క‌మ‌ల్‌కు జోడీగా న‌టింప‌జేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు దృశ్యం-2కు ఆమె దాదాపుగా క‌మ‌ల్‌కు జోడీగా ఖ‌రారైన‌ట్లుగా చెబుతున్నారు.

విశేషం ఏంటంటే.. తెలుగు దృశ్యం, దృశ్యం-2ల్లో న‌దియా న‌టించింది. హీరో చేతిలో హ‌త్య‌కు గుర‌య్యే అబ్బాయికి త‌ల్లిగా ఆమె క‌నిపిస్తుంది. ఐతే మ‌ల‌యాళంలో ఆ పాత్ర‌ను చేసిన ఆశా శ‌ర‌తే.. త‌మిళంలోనూ న‌టించింది. పాప‌నాశం-2లోనూ ఆమెను అలాగే కొన‌సాగించ‌నున్నారు. తెలుగులో ఆశా పాత్ర‌ను చేసిన న‌దియాను త‌మిళంలో హీరోకు జోడీగా చూపించ‌బోతున్నారంటే ఇదొక చిత్ర‌మైన విష‌య‌మే.

This post was last modified on June 28, 2021 5:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago