Movie News

తెలుగు దృశ్యం-2లో ఇలా.. త‌మిళ దృశ్యం-2లో అలా

ముందుగా మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించి.. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, సింహ‌ళ‌, చైనీస్ భాష‌ల్లో రీమేక్ అయి అన్ని చోట్లా సూప‌ర్ హిట్ అయిన సినిమా దృశ్యం. ఈ యూనివ‌ర్శ‌ల్ హిట్‌కు సీక్వెల్‌గా మ‌ల‌యాళంలో తెరకెక్కించిన దృశ్యం-2 కొన్ని నెల‌ల కింద‌టే విడుద‌లై అద్భుత‌మైన స్పంద‌న రాబ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత కొన్ని రోజుల‌కే దీని తెలుగు రీమేక్‌ను మొద‌లుపెట్టేశారు. చాలా త‌క్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేసేశారు.

ఇప్పుడిక ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ త‌మిళ రీమేక్‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. దృశ్యం రీమేక్ పాప‌నాశంలో క‌థానాయకుడిగా న‌టించిన క‌మ‌ల్ హాస‌న్‌తోనే సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆయ‌న‌కు జోడీగా గౌత‌మి న‌టించే అవ‌కాశాల్లేవు. వీళ్లిద్ద‌రూ విడిపోయి దూరం అయిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు మ‌ళ్లీ క‌లిసి సినిమా చేయ‌డానికి ఆస్కారం లేక‌పోయింది.

మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో ట‌నించిన మీనానే.. క‌మ‌ల్‌కు జోడీగా పెడ‌తార‌ని ముందు వార్త‌లొచ్చాయి. కానీ ప్ర‌తి భాష‌లోనూ మీనానే అయితే బాగుండ‌ద‌ని.. వేరే మిడిలేజ్డ్ హీరోయిన్నే ఆ పాత్ర‌కు ఎంచుకుందామ‌ని చూస్తున్నార‌ట‌. తాజాగా ఈ పాత్ర‌కు సీనియ‌ర్ న‌టి న‌దియా పేరు వినిపిస్తోంది. నిజానికి పాప‌నాశంలోనే నదియాను క‌మ‌ల్‌కు జోడీగా న‌టింప‌జేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు దృశ్యం-2కు ఆమె దాదాపుగా క‌మ‌ల్‌కు జోడీగా ఖ‌రారైన‌ట్లుగా చెబుతున్నారు.

విశేషం ఏంటంటే.. తెలుగు దృశ్యం, దృశ్యం-2ల్లో న‌దియా న‌టించింది. హీరో చేతిలో హ‌త్య‌కు గుర‌య్యే అబ్బాయికి త‌ల్లిగా ఆమె క‌నిపిస్తుంది. ఐతే మ‌ల‌యాళంలో ఆ పాత్ర‌ను చేసిన ఆశా శ‌ర‌తే.. త‌మిళంలోనూ న‌టించింది. పాప‌నాశం-2లోనూ ఆమెను అలాగే కొన‌సాగించ‌నున్నారు. తెలుగులో ఆశా పాత్ర‌ను చేసిన న‌దియాను త‌మిళంలో హీరోకు జోడీగా చూపించ‌బోతున్నారంటే ఇదొక చిత్ర‌మైన విష‌య‌మే.

This post was last modified on June 28, 2021 5:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago