ఒక సినిమాకు దర్శకుడిగా ఎంపికై.. ఆ చిత్ర బృందంతో కలిసి ఏడాదికి పైగా ప్రయాణం చేశాక.. ఆ స్క్రిప్టును బాగా ఆకళింపు చేసుకుని చిత్రీకరణకు సిద్ధం అయ్యాక.. ఆ సినిమా నుంచి దర్శకుడు బయటికి రావాల్సి వస్తే మొత్తంగా చిత్ర బృందంలో ఒక అలజడి రేగుతుంది. ఆ దర్శకుడికి కూడా అది చాలా ఇబ్బందికర పరిస్థితే. ఐతే కొన్నిసార్లు ఇలాంటి బ్రేకప్స్ తప్పవు. బాలీవుడ్లో ఓ సినిమా విషయంలో ఇప్పుడు అదే జరిగింది.
మన లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శభాష్ మిథు పేరుతో ఏడాది కిందటే ఓ సినిమాకు రంగం సిద్ధం కావడం తెలిసిందే. ప్రియా అవెన్ రాసిన కథతో రాహుల్ డోలాకియా దర్శకత్వంలో అజిత్ అంధారె ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటన వచ్చింది. ఏడాది నుంచి స్క్రిప్టు మీద, అలాగే ప్రి ప్రొడక్షన్ మీద టీం పని చేస్తోంది. తాప్సి ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకుని మిథాలీలా రూపాంతరం చెందే ప్రయత్నంలో ఉంది.
ఇక కొన్ని రోజుల్లో షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా.. ఈ సినిమా నుంచి రాహుల్ డోలాకియా తప్పుకున్నాడు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్తో రయీస్ లాంటి భారీ చిత్రం తీసిన రాహుల్ స్థాయికి ఇది చిన్న సినిమానే. ఐతే ఏడాదికి పైగా ట్రావెల్ చేశాక ఇప్పుడతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి శ్రీజిత్ ముఖర్జీ అనే కొత్త దర్శకుడు వచ్చాడు. దీని గురించి రాహుల్ స్వయంగా పెద్ద ప్రెస్ నోట్ ఇచ్చాడు. తనకెంతో నచ్చిన స్క్రిప్టు, నచ్చిన సినిమా అంటూనే అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. చిత్ర బృందం గురించి అతను చాలా బాగా మాట్లాడాడు. కానీ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. పరోక్షంగా కరోనా మీద నెపం నెట్టాడు.
ఐతే సైనా సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో మిథాలీ సినిమాపై చిత్ర బృందంలో రకరకాల సందేహాలు తలెత్తాయని.. ఈ క్రమంలో స్క్రిప్టు విషయమై రచయిత, నిర్మాతతో రాహుల్కు విభేదాలు వచ్చాయని.. దీంతో అతను ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on June 23, 2021 8:03 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…