ఒక సినిమాకు దర్శకుడిగా ఎంపికై.. ఆ చిత్ర బృందంతో కలిసి ఏడాదికి పైగా ప్రయాణం చేశాక.. ఆ స్క్రిప్టును బాగా ఆకళింపు చేసుకుని చిత్రీకరణకు సిద్ధం అయ్యాక.. ఆ సినిమా నుంచి దర్శకుడు బయటికి రావాల్సి వస్తే మొత్తంగా చిత్ర బృందంలో ఒక అలజడి రేగుతుంది. ఆ దర్శకుడికి కూడా అది చాలా ఇబ్బందికర పరిస్థితే. ఐతే కొన్నిసార్లు ఇలాంటి బ్రేకప్స్ తప్పవు. బాలీవుడ్లో ఓ సినిమా విషయంలో ఇప్పుడు అదే జరిగింది.
మన లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శభాష్ మిథు పేరుతో ఏడాది కిందటే ఓ సినిమాకు రంగం సిద్ధం కావడం తెలిసిందే. ప్రియా అవెన్ రాసిన కథతో రాహుల్ డోలాకియా దర్శకత్వంలో అజిత్ అంధారె ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటన వచ్చింది. ఏడాది నుంచి స్క్రిప్టు మీద, అలాగే ప్రి ప్రొడక్షన్ మీద టీం పని చేస్తోంది. తాప్సి ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకుని మిథాలీలా రూపాంతరం చెందే ప్రయత్నంలో ఉంది.
ఇక కొన్ని రోజుల్లో షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా.. ఈ సినిమా నుంచి రాహుల్ డోలాకియా తప్పుకున్నాడు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్తో రయీస్ లాంటి భారీ చిత్రం తీసిన రాహుల్ స్థాయికి ఇది చిన్న సినిమానే. ఐతే ఏడాదికి పైగా ట్రావెల్ చేశాక ఇప్పుడతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి శ్రీజిత్ ముఖర్జీ అనే కొత్త దర్శకుడు వచ్చాడు. దీని గురించి రాహుల్ స్వయంగా పెద్ద ప్రెస్ నోట్ ఇచ్చాడు. తనకెంతో నచ్చిన స్క్రిప్టు, నచ్చిన సినిమా అంటూనే అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. చిత్ర బృందం గురించి అతను చాలా బాగా మాట్లాడాడు. కానీ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. పరోక్షంగా కరోనా మీద నెపం నెట్టాడు.
ఐతే సైనా సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో మిథాలీ సినిమాపై చిత్ర బృందంలో రకరకాల సందేహాలు తలెత్తాయని.. ఈ క్రమంలో స్క్రిప్టు విషయమై రచయిత, నిర్మాతతో రాహుల్కు విభేదాలు వచ్చాయని.. దీంతో అతను ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on June 23, 2021 8:03 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…