ఒక సినిమాకు దర్శకుడిగా ఎంపికై.. ఆ చిత్ర బృందంతో కలిసి ఏడాదికి పైగా ప్రయాణం చేశాక.. ఆ స్క్రిప్టును బాగా ఆకళింపు చేసుకుని చిత్రీకరణకు సిద్ధం అయ్యాక.. ఆ సినిమా నుంచి దర్శకుడు బయటికి రావాల్సి వస్తే మొత్తంగా చిత్ర బృందంలో ఒక అలజడి రేగుతుంది. ఆ దర్శకుడికి కూడా అది చాలా ఇబ్బందికర పరిస్థితే. ఐతే కొన్నిసార్లు ఇలాంటి బ్రేకప్స్ తప్పవు. బాలీవుడ్లో ఓ సినిమా విషయంలో ఇప్పుడు అదే జరిగింది.
మన లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శభాష్ మిథు పేరుతో ఏడాది కిందటే ఓ సినిమాకు రంగం సిద్ధం కావడం తెలిసిందే. ప్రియా అవెన్ రాసిన కథతో రాహుల్ డోలాకియా దర్శకత్వంలో అజిత్ అంధారె ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటన వచ్చింది. ఏడాది నుంచి స్క్రిప్టు మీద, అలాగే ప్రి ప్రొడక్షన్ మీద టీం పని చేస్తోంది. తాప్సి ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకుని మిథాలీలా రూపాంతరం చెందే ప్రయత్నంలో ఉంది.
ఇక కొన్ని రోజుల్లో షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా.. ఈ సినిమా నుంచి రాహుల్ డోలాకియా తప్పుకున్నాడు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్తో రయీస్ లాంటి భారీ చిత్రం తీసిన రాహుల్ స్థాయికి ఇది చిన్న సినిమానే. ఐతే ఏడాదికి పైగా ట్రావెల్ చేశాక ఇప్పుడతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి శ్రీజిత్ ముఖర్జీ అనే కొత్త దర్శకుడు వచ్చాడు. దీని గురించి రాహుల్ స్వయంగా పెద్ద ప్రెస్ నోట్ ఇచ్చాడు. తనకెంతో నచ్చిన స్క్రిప్టు, నచ్చిన సినిమా అంటూనే అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. చిత్ర బృందం గురించి అతను చాలా బాగా మాట్లాడాడు. కానీ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో మాత్రం వెల్లడించలేదు. పరోక్షంగా కరోనా మీద నెపం నెట్టాడు.
ఐతే సైనా సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో మిథాలీ సినిమాపై చిత్ర బృందంలో రకరకాల సందేహాలు తలెత్తాయని.. ఈ క్రమంలో స్క్రిప్టు విషయమై రచయిత, నిర్మాతతో రాహుల్కు విభేదాలు వచ్చాయని.. దీంతో అతను ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on June 23, 2021 8:03 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…