టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ రేసులో దూసుకుపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె కెరీర్ చాలా హిట్లు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి తెలుగు సినిమా అవకాశాలు రావడం లేదు. చివరిగా ఆమె నితిన్ నటించిన ‘చెక్’ సినిమాలో కనిపించింది. రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసింది. ఇది తప్ప ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. దానికి కారణం ఏంటనే విషయం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రకుల్. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయని స్పష్టం చేసింది.
అలానే ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే నెట్టుకొస్తారనే విషయాన్ని నమ్మనని చెబుతోంది రకుల్. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఈ కాన్సెప్ట్ వినిపిస్తూనే ఉంటుందని.. అయితే టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలరని చెప్పింది. బ్యాక్ గ్రౌండ్ ఉంటే కొన్ని అవకాశాలు వస్తాయి కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఎక్కువకాలం రాణించగలడం మాత్రం టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ ప్రతిభావంతులను ప్రేక్షకులే నిర్ణయిస్తారని.. అలాంటి వారికే పట్టం కడతారని తెలిపింది.
ఇక సినిమాలకు సంబంధించిన భాషాపరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని.. నచ్చిన కథ దొరికితే ఒప్పుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో ‘ఎటాక్’, ‘మే డే’, ‘థాంక్ గాడ్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో ‘అయలన్’, ‘ఇండియన్ 2’ వంటి సినిమాల్లో నటించడానికి అంగీకరించింది. సౌత్ లో ఆమెకి అవకాశాలు తగ్గినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
This post was last modified on June 20, 2021 2:29 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…