Movie News

బయోపిక్ తో సినిమా తీస్తున్న ఎల్బీ శ్రీరామ్!

గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన కొన్ని సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఇప్పటికీ కొన్ని బయోపిక్స్ సెట్స్ పై ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ కు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా జీవితం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఎల్బీ శ్రీరామ్ మంచి రచయిత అనే విషయం అందరికీ తెలిసిందే. ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ లాంటి హిట్ సినిమాలకు రైటర్ గా పని చేశారాయన. డైలాగ్ రైటర్ గా నంది అవార్డులను సైతం అందుకున్నారు. వెండితెరపై చక్కటి కథలను ప్రెజంట్ చేయాలని తపన పడుతుంటారు ఎల్బీ శ్రీరామ్. దర్శకుడిగా సినిమాలు చేయాలని చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు.

ఎల్బీ శ్రీరాం హార్ట్ ఫిలింస్ అనే పేరుతో లఘు చిత్రాల నిర్మాణం చేపట్టిన ఆయన కొన్నాళ్ల క్రితం ‘డోలు సన్నాయి’ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని చాటే ఈ షార్ట్ ఫిలిం ఆయనకు అవార్డులను తీసుకొచ్చింది. ఇప్పుడొక ఫీచర్ ఫిలిం చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే గుర్రం జాషువా బయోపిక్. ఈ సినిమా కోసం ఇతర రచయితల సాయం కూడా తీసుకొని స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో పడ్డారాయన. తక్కువ కులంలో జన్మించిన కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న గుర్రం జాషువా తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఎదిగారు. సినిమాగా తీయడానికి ఆయన జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. మరి ఈ కథ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి!

This post was last modified on June 19, 2021 8:00 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

7 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

44 minutes ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago