Movie News

శంకర్‌కు 2 కోట్లు క‌ట్ట‌బోతున్న ఆ న‌టుడు

సినీ రంగంలో ప‌ట్టువిడుపులు లేకుంటే చాలా క‌ష్టం. మ‌రీ ప‌ట్టుద‌ల‌కు పోతే కెరీర్లే దెబ్బ తినేస్తుంటాయి. త‌మిళ లెజెండ‌రీ క‌మెడియ‌న్ వ‌డివేలు ఉదంతం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఒక‌ప్పుడు కోలీవుడ్లో ఆయ‌న టాప్ క‌మెడియ‌న్. చేతి నిండా సినిమాల‌తో హీరోల‌ను మించి సంపాదిస్తూ ఉండేవాడాయ‌న‌. ఐతే కాస్త అవ‌కాశాలు త‌గ్గుతున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి కొంత మేర కెరీర్‌ను దెబ్బ తీసుకున్న వ‌డివేలు.. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో క‌య్యం పెట్టుకుని పూర్తిగా త‌న కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.

గ‌తంలో శంక‌ర్ నిర్మాణంలో ఆయ‌న శిష్యుడు చింబుదేవ‌న్.. వ‌డివేలును హీరోగా పెట్టి హింసై అర‌స‌న్ 23వ పుల‌కేసి అనే సినిమా తీశాడు. ఆ చిత్రం త‌మిళంలో పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులోనూ అనువాద‌మై ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి కొన్నేళ్ల కింద‌ట సీక్వెల్ తీయాల‌నుకున్నారు.

శంక‌ర్ నిర్మాణంలోనే వ‌డివేలునే పెట్టి చింబుదేవ‌న్ ఈ సినిమాను మొద‌లుపెట్టాడు. కొంత షూటింగ్ జ‌రిగాక సిన‌మాను మ‌ధ్య‌లో ఆపేశారు. స్క్రిప్టులో మార్పు చేసినందుకో.. మ‌రో కార‌ణంతోనో వ‌డివేలు ఈ సినిమాను వ‌దిలేశాడు. ఆయ‌న‌కు, శంక‌ర్‌కు మ‌ధ్య అప్ప‌ట్లో పెద్ద గొడ‌వే న‌డిచింది. వ‌డివేలు ఇలా సినిమాను మ‌ధ్య‌లో వ‌దిలేయ‌డంతో శంక‌ర్ కోర్టుకెక్కాడు కూడా. ఆ కేసు ఎంత‌కూ తేల‌క‌.. సినిమా ముందుకు క‌ద‌ల‌క‌.. ఏళ్లు గ‌డిచిపోయాయి. ఈ వివాదం వ‌ల్ల వ‌డివేలు త‌ర్వాత సినిమాల‌కు దూరం అయిపోయాడు.

ఐతే ఎట్ట‌కేల‌కు ఇప్పుడు శంక‌ర్, వ‌డివేలు మ‌ధ్య వివాదం ప‌రిష్కారం అయింద‌ట‌. ఐస‌రి గ‌ణేష్ అనే నిర్మాత వీళ్లిద్ద‌రితో మాట్లాడి గొడ‌వ‌ను ప‌రిష్క‌రించాడు. సినిమాను మ‌ధ్య‌లో ఆపేయ‌డం వ‌ల్ల త‌లెత్తిన రూ.2 కోట్ల న‌ష్టాన్ని శంక‌ర్‌కు వ‌డివేలు చెల్లించి ఈ సినిమా షూటింగ్‌కు హాజ‌రు కానున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది హింసై అర‌స‌న్ 24వ పుల‌కేసి విడుద‌ల‌వుతుంద‌ని ఆశిస్తున్నారు.

This post was last modified on June 19, 2021 4:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

7 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

8 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

9 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

9 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

10 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

12 hours ago