సినీ రంగంలో పట్టువిడుపులు లేకుంటే చాలా కష్టం. మరీ పట్టుదలకు పోతే కెరీర్లే దెబ్బ తినేస్తుంటాయి. తమిళ లెజెండరీ కమెడియన్ వడివేలు ఉదంతం ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు కోలీవుడ్లో ఆయన టాప్ కమెడియన్. చేతి నిండా సినిమాలతో హీరోలను మించి సంపాదిస్తూ ఉండేవాడాయన. ఐతే కాస్త అవకాశాలు తగ్గుతున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టి కొంత మేర కెరీర్ను దెబ్బ తీసుకున్న వడివేలు.. స్టార్ డైరెక్టర్ శంకర్తో కయ్యం పెట్టుకుని పూర్తిగా తన కెరీర్ను నాశనం చేసుకున్నాడు.
గతంలో శంకర్ నిర్మాణంలో ఆయన శిష్యుడు చింబుదేవన్.. వడివేలును హీరోగా పెట్టి హింసై అరసన్ 23వ పులకేసి అనే సినిమా తీశాడు. ఆ చిత్రం తమిళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనూ అనువాదమై ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కొన్నేళ్ల కిందట సీక్వెల్ తీయాలనుకున్నారు.
శంకర్ నిర్మాణంలోనే వడివేలునే పెట్టి చింబుదేవన్ ఈ సినిమాను మొదలుపెట్టాడు. కొంత షూటింగ్ జరిగాక సినమాను మధ్యలో ఆపేశారు. స్క్రిప్టులో మార్పు చేసినందుకో.. మరో కారణంతోనో వడివేలు ఈ సినిమాను వదిలేశాడు. ఆయనకు, శంకర్కు మధ్య అప్పట్లో పెద్ద గొడవే నడిచింది. వడివేలు ఇలా సినిమాను మధ్యలో వదిలేయడంతో శంకర్ కోర్టుకెక్కాడు కూడా. ఆ కేసు ఎంతకూ తేలక.. సినిమా ముందుకు కదలక.. ఏళ్లు గడిచిపోయాయి. ఈ వివాదం వల్ల వడివేలు తర్వాత సినిమాలకు దూరం అయిపోయాడు.
ఐతే ఎట్టకేలకు ఇప్పుడు శంకర్, వడివేలు మధ్య వివాదం పరిష్కారం అయిందట. ఐసరి గణేష్ అనే నిర్మాత వీళ్లిద్దరితో మాట్లాడి గొడవను పరిష్కరించాడు. సినిమాను మధ్యలో ఆపేయడం వల్ల తలెత్తిన రూ.2 కోట్ల నష్టాన్ని శంకర్కు వడివేలు చెల్లించి ఈ సినిమా షూటింగ్కు హాజరు కానున్నాడట. వచ్చే ఏడాది హింసై అరసన్ 24వ పులకేసి విడుదలవుతుందని ఆశిస్తున్నారు.
This post was last modified on June 19, 2021 4:22 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…