Movie News

శంకర్‌కు 2 కోట్లు క‌ట్ట‌బోతున్న ఆ న‌టుడు

సినీ రంగంలో ప‌ట్టువిడుపులు లేకుంటే చాలా క‌ష్టం. మ‌రీ ప‌ట్టుద‌ల‌కు పోతే కెరీర్లే దెబ్బ తినేస్తుంటాయి. త‌మిళ లెజెండ‌రీ క‌మెడియ‌న్ వ‌డివేలు ఉదంతం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఒక‌ప్పుడు కోలీవుడ్లో ఆయ‌న టాప్ క‌మెడియ‌న్. చేతి నిండా సినిమాల‌తో హీరోల‌ను మించి సంపాదిస్తూ ఉండేవాడాయ‌న‌. ఐతే కాస్త అవ‌కాశాలు త‌గ్గుతున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి కొంత మేర కెరీర్‌ను దెబ్బ తీసుకున్న వ‌డివేలు.. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో క‌య్యం పెట్టుకుని పూర్తిగా త‌న కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.

గ‌తంలో శంక‌ర్ నిర్మాణంలో ఆయ‌న శిష్యుడు చింబుదేవ‌న్.. వ‌డివేలును హీరోగా పెట్టి హింసై అర‌స‌న్ 23వ పుల‌కేసి అనే సినిమా తీశాడు. ఆ చిత్రం త‌మిళంలో పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులోనూ అనువాద‌మై ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి కొన్నేళ్ల కింద‌ట సీక్వెల్ తీయాల‌నుకున్నారు.

శంక‌ర్ నిర్మాణంలోనే వ‌డివేలునే పెట్టి చింబుదేవ‌న్ ఈ సినిమాను మొద‌లుపెట్టాడు. కొంత షూటింగ్ జ‌రిగాక సిన‌మాను మ‌ధ్య‌లో ఆపేశారు. స్క్రిప్టులో మార్పు చేసినందుకో.. మ‌రో కార‌ణంతోనో వ‌డివేలు ఈ సినిమాను వ‌దిలేశాడు. ఆయ‌న‌కు, శంక‌ర్‌కు మ‌ధ్య అప్ప‌ట్లో పెద్ద గొడ‌వే న‌డిచింది. వ‌డివేలు ఇలా సినిమాను మ‌ధ్య‌లో వ‌దిలేయ‌డంతో శంక‌ర్ కోర్టుకెక్కాడు కూడా. ఆ కేసు ఎంత‌కూ తేల‌క‌.. సినిమా ముందుకు క‌ద‌ల‌క‌.. ఏళ్లు గ‌డిచిపోయాయి. ఈ వివాదం వ‌ల్ల వ‌డివేలు త‌ర్వాత సినిమాల‌కు దూరం అయిపోయాడు.

ఐతే ఎట్ట‌కేల‌కు ఇప్పుడు శంక‌ర్, వ‌డివేలు మ‌ధ్య వివాదం ప‌రిష్కారం అయింద‌ట‌. ఐస‌రి గ‌ణేష్ అనే నిర్మాత వీళ్లిద్ద‌రితో మాట్లాడి గొడ‌వ‌ను ప‌రిష్క‌రించాడు. సినిమాను మ‌ధ్య‌లో ఆపేయ‌డం వ‌ల్ల త‌లెత్తిన రూ.2 కోట్ల న‌ష్టాన్ని శంక‌ర్‌కు వ‌డివేలు చెల్లించి ఈ సినిమా షూటింగ్‌కు హాజ‌రు కానున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది హింసై అర‌స‌న్ 24వ పుల‌కేసి విడుద‌ల‌వుతుంద‌ని ఆశిస్తున్నారు.

Satya

Recent Posts

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

34 minutes ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

1 hour ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

2 hours ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

4 hours ago