బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి సహజీవనం చేయాలనుకుంటున్నారు. దీనికోసం ముంబైలోని పోష్ ఏరియా జుహు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ రూ.175 కోట్లు విలువ చేసే బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ కోసం తన రిచ్ బాయ్ ఫ్రెండ్ ఇంత కాస్ట్లీ ఇంటిని కొన్నాడట. జాక్వెలిన్ డేటింగ్ చేస్తోన్న వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందినవాడని.. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టి జుహు ఏరియాలో బంగ్లా కొనగలిగాడు.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నారు. అందుకే అంత డబ్బు పెట్టి ఇంటిని కొనుగోలు చేశారని టాక్. జాక్వెలిన్ కెరీర్ విషయానికొస్తే.. ‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా సైన్ చేసింది. క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ రాకుమారిగా కనిపించనుంది. త్వరలోనే జాక్వెలిన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది .
This post was last modified on June 17, 2021 5:34 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…