బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి సహజీవనం చేయాలనుకుంటున్నారు. దీనికోసం ముంబైలోని పోష్ ఏరియా జుహు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ రూ.175 కోట్లు విలువ చేసే బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ కోసం తన రిచ్ బాయ్ ఫ్రెండ్ ఇంత కాస్ట్లీ ఇంటిని కొన్నాడట. జాక్వెలిన్ డేటింగ్ చేస్తోన్న వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందినవాడని.. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టి జుహు ఏరియాలో బంగ్లా కొనగలిగాడు.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నారు. అందుకే అంత డబ్బు పెట్టి ఇంటిని కొనుగోలు చేశారని టాక్. జాక్వెలిన్ కెరీర్ విషయానికొస్తే.. ‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా సైన్ చేసింది. క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ రాకుమారిగా కనిపించనుంది. త్వరలోనే జాక్వెలిన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది .
This post was last modified on June 17, 2021 5:34 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…