బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి సహజీవనం చేయాలనుకుంటున్నారు. దీనికోసం ముంబైలోని పోష్ ఏరియా జుహు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ రూ.175 కోట్లు విలువ చేసే బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ కోసం తన రిచ్ బాయ్ ఫ్రెండ్ ఇంత కాస్ట్లీ ఇంటిని కొన్నాడట. జాక్వెలిన్ డేటింగ్ చేస్తోన్న వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందినవాడని.. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టి జుహు ఏరియాలో బంగ్లా కొనగలిగాడు.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నారు. అందుకే అంత డబ్బు పెట్టి ఇంటిని కొనుగోలు చేశారని టాక్. జాక్వెలిన్ కెరీర్ విషయానికొస్తే.. ‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా సైన్ చేసింది. క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ రాకుమారిగా కనిపించనుంది. త్వరలోనే జాక్వెలిన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది .
This post was last modified on June 17, 2021 5:34 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…