టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకూ వెచ్చించనంత సమయం ‘లైగర్’ కోసం కేటాయిస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల సినిమా ఆలస్యమైన సంగతి వాస్తవమే అయినప్పటికీ.. మామూలుగా చూసినా ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ ఎక్కువ అవుతున్నాయి. పోకిరి, బిజినెస్మ్యాన్ లాంటి సినిమాలను మూడు నెలల లోపు వర్కింగ్ డేస్లో పూర్తి చేసిన పూరి జగన్నాథ్.. ‘లైగర్’ కోసం మాత్రం చాలా టైం తీసుకుంటున్నాడు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పున:ప్రారంభం కాబోతోంది. ఈసారి మాత్రం బ్రేకుల్లేకుండా షూటింగ్ జరిపి సినిమాను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు పూరి. రాబోయే షెడ్యూల్లో పూర్తిగా యాక్షన్ ఘట్టాల చిత్రీకరణే ఉంటుందని.. పతాక సన్నివేశాలు కూడా తీయబోతున్నారని సమాచారం.
‘లైగర్’ పతాక సన్నివేశాల్లో తెర నిండా బాక్సర్లు, ఫైటర్లే కనిపించబోతున్నారు. ఐతే అందరూ కొత్త వాళ్లతో నడిపించకుండా ఫేమ్ ఉన్న బాక్సర్లు కొందరు ఫ్రేమ్ల్లో కనిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొందరు ప్రముఖ బాక్సర్లను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రముఖుల్లో వివాదాస్పద బాక్సర్ మైక్ టైసన్ కూడా ఉన్నట్లు సమాచారం. పేద కుటుంబం నుంచి వచ్చి బాక్సర్గా ఎనలేని ఫేమ్ తెచ్చుకుని.. ఆ తర్వాత వివాదాలతో సహవాసం చేసి పేరునంతా పోగొట్టుకున్న టైసన్.. ఒక దశలో దివాళా తీశాడు. ఆ తర్వాత డబ్బు కోసం కొన్ని బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడం.. తన స్థాయికి తగని పనులు చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఐతే ఎన్ని వివాదాలున్నప్పటికీ టైసన్కు ఉన్న ఆకర్షణ మాత్రం వేరు. అతను ఎక్కడుంటే అక్కడ మీడియాలో ఫోకస్ అవుతాడు.
‘లైగర్’ సినిమాలో అతను నటిస్తే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. మరి టైసన్ను ఈ చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on June 17, 2021 2:10 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…