టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకూ వెచ్చించనంత సమయం ‘లైగర్’ కోసం కేటాయిస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల సినిమా ఆలస్యమైన సంగతి వాస్తవమే అయినప్పటికీ.. మామూలుగా చూసినా ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ ఎక్కువ అవుతున్నాయి. పోకిరి, బిజినెస్మ్యాన్ లాంటి సినిమాలను మూడు నెలల లోపు వర్కింగ్ డేస్లో పూర్తి చేసిన పూరి జగన్నాథ్.. ‘లైగర్’ కోసం మాత్రం చాలా టైం తీసుకుంటున్నాడు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పున:ప్రారంభం కాబోతోంది. ఈసారి మాత్రం బ్రేకుల్లేకుండా షూటింగ్ జరిపి సినిమాను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు పూరి. రాబోయే షెడ్యూల్లో పూర్తిగా యాక్షన్ ఘట్టాల చిత్రీకరణే ఉంటుందని.. పతాక సన్నివేశాలు కూడా తీయబోతున్నారని సమాచారం.
‘లైగర్’ పతాక సన్నివేశాల్లో తెర నిండా బాక్సర్లు, ఫైటర్లే కనిపించబోతున్నారు. ఐతే అందరూ కొత్త వాళ్లతో నడిపించకుండా ఫేమ్ ఉన్న బాక్సర్లు కొందరు ఫ్రేమ్ల్లో కనిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొందరు ప్రముఖ బాక్సర్లను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రముఖుల్లో వివాదాస్పద బాక్సర్ మైక్ టైసన్ కూడా ఉన్నట్లు సమాచారం. పేద కుటుంబం నుంచి వచ్చి బాక్సర్గా ఎనలేని ఫేమ్ తెచ్చుకుని.. ఆ తర్వాత వివాదాలతో సహవాసం చేసి పేరునంతా పోగొట్టుకున్న టైసన్.. ఒక దశలో దివాళా తీశాడు. ఆ తర్వాత డబ్బు కోసం కొన్ని బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడం.. తన స్థాయికి తగని పనులు చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఐతే ఎన్ని వివాదాలున్నప్పటికీ టైసన్కు ఉన్న ఆకర్షణ మాత్రం వేరు. అతను ఎక్కడుంటే అక్కడ మీడియాలో ఫోకస్ అవుతాడు.
‘లైగర్’ సినిమాలో అతను నటిస్తే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. మరి టైసన్ను ఈ చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…