టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకూ వెచ్చించనంత సమయం ‘లైగర్’ కోసం కేటాయిస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల సినిమా ఆలస్యమైన సంగతి వాస్తవమే అయినప్పటికీ.. మామూలుగా చూసినా ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ ఎక్కువ అవుతున్నాయి. పోకిరి, బిజినెస్మ్యాన్ లాంటి సినిమాలను మూడు నెలల లోపు వర్కింగ్ డేస్లో పూర్తి చేసిన పూరి జగన్నాథ్.. ‘లైగర్’ కోసం మాత్రం చాలా టైం తీసుకుంటున్నాడు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పున:ప్రారంభం కాబోతోంది. ఈసారి మాత్రం బ్రేకుల్లేకుండా షూటింగ్ జరిపి సినిమాను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు పూరి. రాబోయే షెడ్యూల్లో పూర్తిగా యాక్షన్ ఘట్టాల చిత్రీకరణే ఉంటుందని.. పతాక సన్నివేశాలు కూడా తీయబోతున్నారని సమాచారం.
‘లైగర్’ పతాక సన్నివేశాల్లో తెర నిండా బాక్సర్లు, ఫైటర్లే కనిపించబోతున్నారు. ఐతే అందరూ కొత్త వాళ్లతో నడిపించకుండా ఫేమ్ ఉన్న బాక్సర్లు కొందరు ఫ్రేమ్ల్లో కనిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొందరు ప్రముఖ బాక్సర్లను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రముఖుల్లో వివాదాస్పద బాక్సర్ మైక్ టైసన్ కూడా ఉన్నట్లు సమాచారం. పేద కుటుంబం నుంచి వచ్చి బాక్సర్గా ఎనలేని ఫేమ్ తెచ్చుకుని.. ఆ తర్వాత వివాదాలతో సహవాసం చేసి పేరునంతా పోగొట్టుకున్న టైసన్.. ఒక దశలో దివాళా తీశాడు. ఆ తర్వాత డబ్బు కోసం కొన్ని బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడం.. తన స్థాయికి తగని పనులు చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఐతే ఎన్ని వివాదాలున్నప్పటికీ టైసన్కు ఉన్న ఆకర్షణ మాత్రం వేరు. అతను ఎక్కడుంటే అక్కడ మీడియాలో ఫోకస్ అవుతాడు.
‘లైగర్’ సినిమాలో అతను నటిస్తే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. మరి టైసన్ను ఈ చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on June 17, 2021 2:10 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…