జబర్దస్త్ కామెడీ షోలో వచ్చే స్కిట్లు వివాదాస్పదం కావడం.. కేసులు నమోదవడం కొత్తేమీ కాదు. కామెడీ కోసం కొన్నిసార్లు అందులోని పాత్రధారులు హద్దులు దాటి కొందరి సెంటిమెంట్లను గాయపరచడం జరుగుతుంటుంది. గతంలో ఒక స్కిట్లో వేణు చేసిన విన్యాసాలు నచ్చక ఓ వర్గం వాళ్లు అతడిపై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. ఈ దెబ్బతో అతను ఈ షోకే దూరం కావాల్సి వచ్చింది. షకలక శంకర్ చేసిన ఓ స్కిట్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఆగ్రహం తెప్పించడం, అతను క్షమాపణలు చెప్పడం తెలసిిందే. ఇలా ఆ తర్వాత కొన్ని స్కిట్లు వివాదాస్పదం అయ్యాయి.
తాజాగా ఇప్పుడు మరో స్కిట్ వివాదాస్పదంగా మారింది. ఈ స్కిట్ చేసింది ప్రస్తుతం జబర్దస్త్లో నంబర్ వన్ కమెడియన్ అనదగ్గ హైపర్ ఆది కావడం విశేషం. ఐతే వివాదానికి కారణమైంది జబర్దస్త్ స్కిట్ కాదు. అందులో మాదిరే మరో టీవీ కార్యక్రమంలో చేసిన స్కిట్.
తెలంగాణ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా భావించే బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆది తాజాగా ఒక స్కిట్ చేశాడు. ఈ ఆదివారం ఓ కార్యక్రమంలో భాగంగా అది ప్రసారమైంది. అందులో ఉయ్యాలో ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాట పాడుతూ కమెడియన్లందరూ చుట్టూ తిరిగే దృశ్యం ఉంది. బతుకమ్మ పాట మీద కామెడీ చేస్తూ కొంచెం సెటైరిగ్గా ఈ సన్నివేశాలను నడిపించారు. ఇది తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
తెలంగాణ గ్రామదేవతల పండుగలను, ఇక్కడి ప్రజల యాస భాషలను కించపరిచేలా ఈ స్కిట్ ఉందని, హైపర్ ఆదితో పాటు ఈ స్కిట్ రైటర్, దీన్ని ప్రొడ్యూస్ చేసిన మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మీద చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పండుగను ఈ స్కిట్లో అవహేళన చేశారని.. ద్వంద్వార్థాలు వచ్చే డైలాగులతో తెలంగాణ భాష, యాసలను కించపరిచారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా కేసు నమోదైనట్లు తెలియగానే సదరు ఎపిసోడ్ను నిర్వాహకులు యూట్యూబ్ నుంచి తొలగించేయడం గమనార్హం.
This post was last modified on June 15, 2021 1:03 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…