సంచలన వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు రామ్ గోపాల్ వర్మ. ఐతే ఆయన శ్రద్ధ పెట్టి సినిమాలు తీసినపుడు ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పట్టారు. కానీ కొన్నేళ్ల నుంచి ఆయన ఎంత నాసిరకం సినిమాలు తీస్తున్నాడో.. ఎలా తన అభిమానులను హింసిస్తున్నాడో తెలిసిందే. డైహార్డ్ ఫ్యాన్స్ సైతం వర్మ సినిమా అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేసింది. తాను ఫామ్ కోల్పోయాక కూడా కొంతకాలం పబ్లిసిటీ గిమ్మిక్కులతో నెట్టుకొచ్చాడు కానీ.. ఈ మధ్య అవి కూడా పని చేయట్లేదు.
మర్డర్, కరోనా వైరస్ లాంటి వర్మ బ్రాండు సినిమాలకు కనీస స్పందన కరవైంది. వీటి మీద పెట్టిన స్వల్ప పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. అయినా వర్మ ఆగట్లేదు. దిశ ఎన్కౌంటర్ అంటూ మరో సంచలన ఉదంతంపై సినిమాను రెడీ చేశాడు.
ఐతే గత ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రానికి కోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా విడుదలను ఆపాలని బాధితురాలి కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా దీనిపై విచారణ జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ కూడా అయిందని, ఇంకేం అభ్యంతరాలుంటాయని నిర్మాతలు కోర్టుకు వివరణ ఇచ్చారు. ఐతే సినిమా విడుదలను ఇంకో రెండు వారాలు ఆపాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.
ఐతే దిశ ఎన్కౌంటర్ సినిమా రిలీజ్ ఆగిందని.. కోర్టులో అడ్డంకులని కూడా మీడియాలో ఎవరూ పెద్దగా రిపోర్ట్ చేయట్లేదు. ఈ సినిమా గురించి ఎవరికీ పట్టింపు లేదు. ఐతే వర్మ మాత్రం ఈ సినిమా పెద్ద వివాదంలో చిక్కుకున్నట్లు, మీడియాలో పెద్ద చర్చ జరిగిపోతున్నట్లు తాజాగా వరుసబెట్టి ట్వీట్లు వేశాడు. ఈ సినిమా గురించి ఊహాగానాల గురించి తాను క్లారిటీ ఇవ్వదలుచుకున్నానని.. రెండు నెలల ముందే దీనికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని, అన్ని రకాల న్యాయపరమైన అడ్డంకులూ తొలగిపోయాక సినిమాను రిలీజ్ చేస్తామని ఆయనన్నాడు. ఐతే ఈ సినిమా రిలీజ్కు రెడీ అయినప్పటి నుంచి వర్మ ఎంత హడావుడి చేస్తున్నప్పటికీ ఈ చిత్రం జనాల దృష్టినైతే ఆకర్షిస్తున్నట్లు కనిపించడం లేదు.
This post was last modified on June 15, 2021 6:58 am
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…