సంచలన వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు రామ్ గోపాల్ వర్మ. ఐతే ఆయన శ్రద్ధ పెట్టి సినిమాలు తీసినపుడు ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పట్టారు. కానీ కొన్నేళ్ల నుంచి ఆయన ఎంత నాసిరకం సినిమాలు తీస్తున్నాడో.. ఎలా తన అభిమానులను హింసిస్తున్నాడో తెలిసిందే. డైహార్డ్ ఫ్యాన్స్ సైతం వర్మ సినిమా అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేసింది. తాను ఫామ్ కోల్పోయాక కూడా కొంతకాలం పబ్లిసిటీ గిమ్మిక్కులతో నెట్టుకొచ్చాడు కానీ.. ఈ మధ్య అవి కూడా పని చేయట్లేదు.
మర్డర్, కరోనా వైరస్ లాంటి వర్మ బ్రాండు సినిమాలకు కనీస స్పందన కరవైంది. వీటి మీద పెట్టిన స్వల్ప పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. అయినా వర్మ ఆగట్లేదు. దిశ ఎన్కౌంటర్ అంటూ మరో సంచలన ఉదంతంపై సినిమాను రెడీ చేశాడు.
ఐతే గత ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రానికి కోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా విడుదలను ఆపాలని బాధితురాలి కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా దీనిపై విచారణ జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ కూడా అయిందని, ఇంకేం అభ్యంతరాలుంటాయని నిర్మాతలు కోర్టుకు వివరణ ఇచ్చారు. ఐతే సినిమా విడుదలను ఇంకో రెండు వారాలు ఆపాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.
ఐతే దిశ ఎన్కౌంటర్ సినిమా రిలీజ్ ఆగిందని.. కోర్టులో అడ్డంకులని కూడా మీడియాలో ఎవరూ పెద్దగా రిపోర్ట్ చేయట్లేదు. ఈ సినిమా గురించి ఎవరికీ పట్టింపు లేదు. ఐతే వర్మ మాత్రం ఈ సినిమా పెద్ద వివాదంలో చిక్కుకున్నట్లు, మీడియాలో పెద్ద చర్చ జరిగిపోతున్నట్లు తాజాగా వరుసబెట్టి ట్వీట్లు వేశాడు. ఈ సినిమా గురించి ఊహాగానాల గురించి తాను క్లారిటీ ఇవ్వదలుచుకున్నానని.. రెండు నెలల ముందే దీనికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని, అన్ని రకాల న్యాయపరమైన అడ్డంకులూ తొలగిపోయాక సినిమాను రిలీజ్ చేస్తామని ఆయనన్నాడు. ఐతే ఈ సినిమా రిలీజ్కు రెడీ అయినప్పటి నుంచి వర్మ ఎంత హడావుడి చేస్తున్నప్పటికీ ఈ చిత్రం జనాల దృష్టినైతే ఆకర్షిస్తున్నట్లు కనిపించడం లేదు.
This post was last modified on June 15, 2021 6:58 am
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…