పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘పింక్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. మరికొన్ని రోజులు థియేటర్లో ఉంటే గనుక కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లను సడెన్ గా మూసేయడంతో ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ కు బ్రేక్ పడింది. ఆ తరువాత కొన్నాళ్లకు సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. దీంతో థియేటర్లో చూడని వారు ఓటీటీలో సినిమాను కవర్ చేశారు.
అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజు మరోసారి ‘వకీల్ సాబ్’ సినిమాను థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఈ నెలాఖరుకి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే జూలైలో థియేటర్లు తెరుచుకోవచ్చు. అప్పటికప్పుడు రిలీజ్ చేయడానికి సినిమాలు రెడీగా ఉండకపోవచ్చు. అందుకే ‘వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.
మరోసారి పవన్ క్రేజ్ ను వాడుకొని జనాలను థియేటర్లకు రప్పించాలనుకుంటున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది కాబట్టి పెద్ద సినిమాలు ఇప్పట్లో రిలీజ్ కావు. కాబట్టి ఆ గ్యాప్ ను ‘వకీల్ సాబ్’తో కవర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. సినిమాలో కొన్ని సీన్లను యాడ్ చేయబోతున్నారట. నిడివి ఎక్కువ అవుతుందని ఎడిట్ చేసిన సన్నివేశాలను ఇప్పుడు జోడించబోతున్నారు. అలా ‘వకీల్ సాబ్’ కొత్త వెర్షన్ తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. మరి ఈ కొత్త సీన్స్ చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కు వస్తారో లేదో చూడాలి!
This post was last modified on June 14, 2021 11:35 am
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…