పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘పింక్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. మరికొన్ని రోజులు థియేటర్లో ఉంటే గనుక కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లను సడెన్ గా మూసేయడంతో ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ కు బ్రేక్ పడింది. ఆ తరువాత కొన్నాళ్లకు సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. దీంతో థియేటర్లో చూడని వారు ఓటీటీలో సినిమాను కవర్ చేశారు.
అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజు మరోసారి ‘వకీల్ సాబ్’ సినిమాను థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఈ నెలాఖరుకి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే జూలైలో థియేటర్లు తెరుచుకోవచ్చు. అప్పటికప్పుడు రిలీజ్ చేయడానికి సినిమాలు రెడీగా ఉండకపోవచ్చు. అందుకే ‘వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.
మరోసారి పవన్ క్రేజ్ ను వాడుకొని జనాలను థియేటర్లకు రప్పించాలనుకుంటున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది కాబట్టి పెద్ద సినిమాలు ఇప్పట్లో రిలీజ్ కావు. కాబట్టి ఆ గ్యాప్ ను ‘వకీల్ సాబ్’తో కవర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. సినిమాలో కొన్ని సీన్లను యాడ్ చేయబోతున్నారట. నిడివి ఎక్కువ అవుతుందని ఎడిట్ చేసిన సన్నివేశాలను ఇప్పుడు జోడించబోతున్నారు. అలా ‘వకీల్ సాబ్’ కొత్త వెర్షన్ తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. మరి ఈ కొత్త సీన్స్ చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కు వస్తారో లేదో చూడాలి!
This post was last modified on June 14, 2021 11:35 am
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…