గాయనిగా పరిచయమై నటిగా సెటిలైపోయిన తమిళ అమ్మాయి ఆండ్రియా జెరెమీ. మత్తెక్కించే వాయిస్తో ఆమె పాడిన పాటలు క్లాసిక్స్ లాగా నిలిచిపోయాయి తమిళంలో. సెక్సీ లుక్స్తో ఉండే ఈ అమ్మాయి దర్శకుల దృష్టిని ఆకర్షించి ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేసింది. అవి బాగా క్లిక్ కావడంతో తర్వాత పూర్తి స్థాయిలో నటిగా మారింది. కథానాయికగా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది. ఐతే ఆండ్రియా రెగ్యులర్ హీరోయిన్ల పాత్రలు చేయడం తక్కువ. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటేనే క్యారెక్టర్లు ఒప్పుకుంటుంది. పాత్రలు డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్గా అయినా నటించడానికి ఆమె వెనుకాడదు. తెలుగులోకి కూడా అనువాదం అయిన తరమణి లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ.
ఇప్పుడు ఆండ్రియా తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న సినిమా.. పిసాసు-2. విలక్షణ చిత్రాలు తీసే మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. తెలుగులోకి పిశాచి పేరుతో అనువాదమై ఇక్కడా మంచి ఫలితాన్నందుకున్న చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ఆండ్రియాదే లీడ్ రోల్. తన సినిమాల్లో కథానాయికల పాత్రలను చాలా భిన్నంగా ప్రెజెంట్ చేస్తాడు మిస్కిన్. అవి కొంచెం బోల్డ్గా కూడా ఉంటాయి.
పిసాసు-2లో బోల్డ్నెస్ కొంచెం ఎక్కువే అని.. ఒక సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా కూడా కనిపించనుందని కోలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి. సెమీ న్యూడ్గా కనిపించే ఆ సన్నివేశాన్ని తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ మధ్య తెరకెక్కించారట. ఈ పాత్ర కచ్చితంగా ఆండ్రియా కెరీర్లో ఒక మైలురాయి అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆండ్రియా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on June 14, 2021 8:44 am
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…