గాయనిగా పరిచయమై నటిగా సెటిలైపోయిన తమిళ అమ్మాయి ఆండ్రియా జెరెమీ. మత్తెక్కించే వాయిస్తో ఆమె పాడిన పాటలు క్లాసిక్స్ లాగా నిలిచిపోయాయి తమిళంలో. సెక్సీ లుక్స్తో ఉండే ఈ అమ్మాయి దర్శకుల దృష్టిని ఆకర్షించి ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేసింది. అవి బాగా క్లిక్ కావడంతో తర్వాత పూర్తి స్థాయిలో నటిగా మారింది. కథానాయికగా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది. ఐతే ఆండ్రియా రెగ్యులర్ హీరోయిన్ల పాత్రలు చేయడం తక్కువ. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటేనే క్యారెక్టర్లు ఒప్పుకుంటుంది. పాత్రలు డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్గా అయినా నటించడానికి ఆమె వెనుకాడదు. తెలుగులోకి కూడా అనువాదం అయిన తరమణి లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ.
ఇప్పుడు ఆండ్రియా తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న సినిమా.. పిసాసు-2. విలక్షణ చిత్రాలు తీసే మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. తెలుగులోకి పిశాచి పేరుతో అనువాదమై ఇక్కడా మంచి ఫలితాన్నందుకున్న చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ఆండ్రియాదే లీడ్ రోల్. తన సినిమాల్లో కథానాయికల పాత్రలను చాలా భిన్నంగా ప్రెజెంట్ చేస్తాడు మిస్కిన్. అవి కొంచెం బోల్డ్గా కూడా ఉంటాయి.
పిసాసు-2లో బోల్డ్నెస్ కొంచెం ఎక్కువే అని.. ఒక సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా కూడా కనిపించనుందని కోలీవుడ్ మీడియా వర్గాలు అంటున్నాయి. సెమీ న్యూడ్గా కనిపించే ఆ సన్నివేశాన్ని తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూ మధ్య తెరకెక్కించారట. ఈ పాత్ర కచ్చితంగా ఆండ్రియా కెరీర్లో ఒక మైలురాయి అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆండ్రియా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on June 14, 2021 8:44 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…