బుల్లితెరపై ‘ఆట’, ‘మాయాద్వీపం’ లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తర్వాత దర్శకుడిగా అరంగేట్రం చేసిన వ్యక్తి ఓంకార్. టీవీ షోల్లో అతను చేసే అతి కొంతమందికి చికాకు తెప్పించినప్పటికీ.. టార్గెటెడ్ ఆడియన్స్ను అయితే అతను మెప్పించగలిగాడు. ఆ షోలను విజయవంతం చేయగలిగాడు.
అక్కడ్నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసంతోనే దర్శకుడిగా మారి ‘జీనియస్’ అనే సినిమా చేశాడు. కానీ అది తుస్సుమంది. ఐతే అంతటితో అతడి సినీ ప్రయాణం ఆగిపోతుందనుకున్నాంతా. కానీ హార్రర్ కామెడీ జానర్లో అతను చేసిన ‘రాజు గారి గది’ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మంచి విజయాన్నందుకుంది. అందులో కథాకథనాలన్నీ పాతవే అయినప్పటికీ.. కామెడీ వర్కవుట్ కావడంతో ఆ టైంకి అది మంచి ఫలితాన్నందుకుంది. కానీ ఒక సినిమా హిట్టయింది కదా అని అదే ఫార్ములాలో మళ్లీ మళ్లీ సినిమాలు తీసి బోల్తా కొట్టాడు ఓంకార్.
మంచి అంచనాల మధ్య వచ్చిన ‘రాజు గారి గది-2’తో పాటు ‘రాజు గారి గది-3’ కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి ఓంకార్ సొంత కథలతో చేసిన సినిమాలు కావు. మలయాళం, తమిళంలో హిట్టయిన సినిమాల కథలను పట్టుకొచ్చి ‘రాజు గారి గది’ గొడుగు కింద పెట్టేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ‘రాజు గారి గది-3’ చూశాక ఈ అతి కామెడీ చాలు బాబోయ్ అనేశారు జనాలు.
అయినా సరే.. ఓంకార్ ఏమీ వెనక్కి తగ్గట్లేదు. జనాలకు మొహం మొత్తిన ఫార్ములాలోనే ఇంకో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తన నుంచి ‘రాజు గారి గది-4’ మూవీ రాబోతున్నట్లు తాజాగా అతను ప్రకటించాడు. ఈ సినిమాకు కథ ఎప్పుడో రెడీ అయిందని, కరోనా వల్ల షూటింగ్ మొదలు కాలేదని.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తానని ప్రకటించాడు. ఇది కాక ఒక స్పోర్ట్స్ డ్రామా, రూరల్ డ్రామా నేపథ్యంలో కథలు రెడీ చేశానని.. వీలును బట్టి ఆ సినిమాలను తెరకెక్కిస్తానని చెప్పాడు. ఐతే వేరే సినిమాల సంగతేమో కానీ.. రాజుగారి గది సిరీస్లో నాలుగో సినిమా అనేసరికే జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
This post was last modified on June 13, 2021 4:24 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…