బుల్లితెరపై ‘ఆట’, ‘మాయాద్వీపం’ లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తర్వాత దర్శకుడిగా అరంగేట్రం చేసిన వ్యక్తి ఓంకార్. టీవీ షోల్లో అతను చేసే అతి కొంతమందికి చికాకు తెప్పించినప్పటికీ.. టార్గెటెడ్ ఆడియన్స్ను అయితే అతను మెప్పించగలిగాడు. ఆ షోలను విజయవంతం చేయగలిగాడు.
అక్కడ్నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసంతోనే దర్శకుడిగా మారి ‘జీనియస్’ అనే సినిమా చేశాడు. కానీ అది తుస్సుమంది. ఐతే అంతటితో అతడి సినీ ప్రయాణం ఆగిపోతుందనుకున్నాంతా. కానీ హార్రర్ కామెడీ జానర్లో అతను చేసిన ‘రాజు గారి గది’ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మంచి విజయాన్నందుకుంది. అందులో కథాకథనాలన్నీ పాతవే అయినప్పటికీ.. కామెడీ వర్కవుట్ కావడంతో ఆ టైంకి అది మంచి ఫలితాన్నందుకుంది. కానీ ఒక సినిమా హిట్టయింది కదా అని అదే ఫార్ములాలో మళ్లీ మళ్లీ సినిమాలు తీసి బోల్తా కొట్టాడు ఓంకార్.
మంచి అంచనాల మధ్య వచ్చిన ‘రాజు గారి గది-2’తో పాటు ‘రాజు గారి గది-3’ కూడా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఇవి ఓంకార్ సొంత కథలతో చేసిన సినిమాలు కావు. మలయాళం, తమిళంలో హిట్టయిన సినిమాల కథలను పట్టుకొచ్చి ‘రాజు గారి గది’ గొడుగు కింద పెట్టేశాడు. అయినా ఫలితం లేకపోయింది. ‘రాజు గారి గది-3’ చూశాక ఈ అతి కామెడీ చాలు బాబోయ్ అనేశారు జనాలు.
అయినా సరే.. ఓంకార్ ఏమీ వెనక్కి తగ్గట్లేదు. జనాలకు మొహం మొత్తిన ఫార్ములాలోనే ఇంకో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. తన నుంచి ‘రాజు గారి గది-4’ మూవీ రాబోతున్నట్లు తాజాగా అతను ప్రకటించాడు. ఈ సినిమాకు కథ ఎప్పుడో రెడీ అయిందని, కరోనా వల్ల షూటింగ్ మొదలు కాలేదని.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తానని ప్రకటించాడు. ఇది కాక ఒక స్పోర్ట్స్ డ్రామా, రూరల్ డ్రామా నేపథ్యంలో కథలు రెడీ చేశానని.. వీలును బట్టి ఆ సినిమాలను తెరకెక్కిస్తానని చెప్పాడు. ఐతే వేరే సినిమాల సంగతేమో కానీ.. రాజుగారి గది సిరీస్లో నాలుగో సినిమా అనేసరికే జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
This post was last modified on June 13, 2021 4:24 pm
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం…
మాటల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్కడున్నా వారిని తనవైపు తిప్పుకోగల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం…
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…
నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…