ఒక కాంబినేషన్ లో సినిమా హిట్ అయిందంటే చాలు.. మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా చేయాలనుకుంటారు. నటీనటులు, టెక్నీషియన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఇండస్ట్రీ జనాలకు ఉన్న సెంటిమెంట్లే దానికి కారణమని చెప్పాలి. అయితే ఇలా సెంటిమెంట్ రిపీట్ చేసిన ప్రతీసారి హిట్ అయితే రాలేదు. అయినప్పటికీ సినీ జనాలకు నమ్మకం అయితే పోలేదు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తీయనున్న సినిమా కోసం ‘అల వైకుంఠపురంలో’ సినిమా టెక్నీషియన్స్ ను రిపీట్ చేస్తున్నారు.
ఇప్పుడు బాలకృష్ణ సినిమా విషయంలో కూడా అలానే చేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు గోపీచంద్ ‘క్రాక్’ టీమ్ మొత్తాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నారు. దాదాపు ‘క్రాక్’ టెక్నికల్ టీమ్ మొత్తం బాలయ్య సినిమాకి పని చేయనుంది.
వీరితో పాటు ‘క్రాక్’ సినిమాలో విలన్ గా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా బాలయ్య సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ రోల్ మాత్రం కాదు. ఓ కీలకపాత్రలో ఆమె కనిపించనుంది. అలానే ‘క్రాక్’ సినిమాలో నటించిన కొందరిని బాలయ్య సినిమాలో రిపీట్ చేయనున్నారని సమాచారం. మరి ఇన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతున్న గోపీచంద్ మలినేని ఏ రేంజ్ లో హిట్ కొడతారో చూడాలి!
సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ మొదటిసారి నిర్మించిన టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' నిన్నటి నుంచి…
రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే…
ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఫౌజీ విడుదల ఎప్పుడనేది తేలడం లేదు.…
రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ…
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…