ఒక కాంబినేషన్ లో సినిమా హిట్ అయిందంటే చాలు.. మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా చేయాలనుకుంటారు. నటీనటులు, టెక్నీషియన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఇండస్ట్రీ జనాలకు ఉన్న సెంటిమెంట్లే దానికి కారణమని చెప్పాలి. అయితే ఇలా సెంటిమెంట్ రిపీట్ చేసిన ప్రతీసారి హిట్ అయితే రాలేదు. అయినప్పటికీ సినీ జనాలకు నమ్మకం అయితే పోలేదు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తీయనున్న సినిమా కోసం ‘అల వైకుంఠపురంలో’ సినిమా టెక్నీషియన్స్ ను రిపీట్ చేస్తున్నారు.
ఇప్పుడు బాలకృష్ణ సినిమా విషయంలో కూడా అలానే చేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు గోపీచంద్ ‘క్రాక్’ టీమ్ మొత్తాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నారు. దాదాపు ‘క్రాక్’ టెక్నికల్ టీమ్ మొత్తం బాలయ్య సినిమాకి పని చేయనుంది.
వీరితో పాటు ‘క్రాక్’ సినిమాలో విలన్ గా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా బాలయ్య సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ రోల్ మాత్రం కాదు. ఓ కీలకపాత్రలో ఆమె కనిపించనుంది. అలానే ‘క్రాక్’ సినిమాలో నటించిన కొందరిని బాలయ్య సినిమాలో రిపీట్ చేయనున్నారని సమాచారం. మరి ఇన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతున్న గోపీచంద్ మలినేని ఏ రేంజ్ లో హిట్ కొడతారో చూడాలి!
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…