Movie News

యూవీ క్రియేషన్స్ ప్లానింగ్ అదుర్స్!

టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాను తెరకెక్కిస్తోంది. ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూనే ఇప్పుడు చిన్న సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాను నిర్మించింది. అమెజాన్ లో విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. కేవలం రెండు కోట్లతో నిర్మించిన ఈ సినిమాను అమెజాన్ సంస్థ ఏకంగా తొమ్మిది కోట్లు పెట్టి కొనుక్కుంది.

దానికి కారణం యూవీ క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్రాండ్ వాల్యూ అనే చెప్పాలి. చిన్న సినిమాల్లో ఇంత లాభం ఉందని గ్రహించిన ఈ సంస్థ ఇప్పుడు అదే తరహాలో మరిన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతోంది. ‘ఏక్ మినీ కథ’కు స్టోరీ అందించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో మరో కథ రెడీ చేయించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. అది కూడా ఓ బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా అని తెలుస్తోంది. ఇది కాకుండా మారుతితో సైలెంట్ గా మరో సినిమా మొదలుపెట్టింది.

ఇందులో కూడా సంతోష్ శోభన్ నే హీరోగా తీసుకున్నారు. నెల రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా రెండు కోట్ల లోపే అని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తవ్వక ముందే బేరం కుదిరిపోయిందట. ‘ఆహా’ సంస్థ ఎక్కువ మొత్తం చెల్లించి ఈ సినిమా రైట్స్ ను తీసుకుందట. దాదాపు అనుకున్న బడ్జెట్ కి మూడు రెట్లు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో లాభాలు రావడం విశేషమనే చెప్పాలి. భవిష్యత్తులో యూవీ సంస్థ మరిన్ని చిన్న సినిమాలను రావడం ఖాయం!

This post was last modified on June 11, 2021 7:22 am

Share
Show comments

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago