ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ రిలీజ్కు ముందు, తర్వాత చర్చంతా సమంత అక్కినేని గురించే. ఈ సిరీస్లో లీడ్ రోల్ చేసిన మనోజ్ బాజ్పేయి సెకండ్ సీజన్లోనూ అదరగొట్టేశాడు. ఆయన పెర్ఫామెన్స్ గురించి ఎంతమాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ రెండో సీజన్ రిలీజ్ ముంగిట సమంత పాత్ర గురించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టంతా దాని మీదే నిలిచింది. ఇక సిరీస్ చూశాక అందరూ సమంత గురించే మాట్లాడుకున్నారు.
ఎల్టీటీఈ సభ్యురాలైన రాజి పాత్రలో సమంత ఇచ్చిన పెర్ఫామెన్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు. పాత్రగా కూడా అది బాగా ఆకట్టుకుంది. కొన్ని బోల్డ్ సీన్స్, అలాగే యాక్షన్ ఘట్టాలైతే మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. సినిమాలతో వచ్చిన పేరు కంటే ఈ సిరీస్కు ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది సమంత.
రాజి పాత్రతో ఇంతగా ఈ సిరీస్కు ఆకర్షణగా నిలిచిన సమంత.. ఈ పాత్ర కోసం ఎంత పారితోషకం తీసుకుని ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఓ సినిమాకు సామ్ గరిష్టంగా తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.2 కోట్లు కాగా.. ఫ్యామిలీ మ్యాన్-2లో రాజి పాత్ర కోసం మాత్రం దాని మీద రెట్టింపు మొత్తం అందుకుందట. ఈ సిరీస్ కోసం ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావడం, పాత్ర కోసం ప్రిపరేషన్ కూడా చాలా ఉండటంతో ఆమెకు భారీ పారితోషకమే ఇచ్చారట. ఇక షోలో ఆమె పెర్ఫామెన్స్ చూశాక ఆ పారితోషకం ఎంతమాత్రం ఎక్కువ కాదు అనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ మ్యాన్-2 తర్వాత ఆమెకు వెబ్ సిరీస్లో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. సినిమాల్లో కథ ముగిసిపోయినా వెబ్ సిరీస్లతో ఆమె కెరీర్ను కొనసాగించడానికి స్కోప్ బాగానే ఉంది.
This post was last modified on June 10, 2021 8:44 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…