Movie News

రామ్ కోసం భలే విలన్


‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో యువ కథానాయకుడు రామ్ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అప్పటిదాకా రామ్ సినిమా అంటే 10-15 కోట్ల బడ్జెట్.. సినిమా హిట్టయితే 20-25 కోట్ల మధ్య కలెక్షన్లు అన్నట్లుండేది వ్యవహారం. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ దాదాపు రూ.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. దీంతో రామ్ మీద పెద్ద బడ్జెట్లు పెట్టి భారీ సినిమాలు తీయొచ్చన్న భరోసా నిర్మాతలకు కలిగింది.

ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో రామ్ చేస్తున్న బహు భాషా చిత్రం అలాంటిదే. దీని మీద రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. కాస్టింగ్, టెక్నికల్ సపోర్ట్ కూడా కొంచెం ఘనంగానే ఉండేలా చూసుకుంటున్నారు. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టిని ఈ చిత్రానికి కథానాయికగా ఎంచుకోగా.. ఒక పవర్ ఫుల్ విలన్ కోసం చూస్తున్నారు.

ముందు తమిళ నటుడు అరుణ్ విజయ్‌ పేరును ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే అరుణ్‌కు తెలుగులో అంతగా పేరు లేదు. మన వాళ్లకు కూడా బాగా పరిచయం ఉన్న నటుడైతే బాగుంటుందని ఇప్పుడు మాధవన్ వైపు చూస్తున్నాడట లింగుస్వామి. ‘వేట్టై’ రూపంలో తనకు పెద్ద హిట్టిచ్చిన లింగుస్వామి అడిగితే.. అతను కాదనకపోవచ్చు. ప్రస్తుతం మాధవన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని.. దాదాపుగా అతనే ఖరారయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మాధవన్‌కు తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది కానీ.. ఒక్కటే సమస్య. అతను ఇంతకుముందు తెలుగులో నెగెటివ్ రోల్స్ చేసిన సవ్యసాచి, నిశ్శబ్దం చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మరి ఆ నెగెటివ్ సెంటిమెంటును పట్టించుకోకుంటే రామ్-మాధవన్ మధ్య హోరాహోరీని చూసే అవకాశం దక్కుతుంది ప్రేక్షకులకు.

This post was last modified on June 7, 2021 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago