దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే ఉత్తమ తొలి చిత్ర నటిగా జీ సినీ అవార్డుని అందుకుంది. ఆ తరువాత ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా’ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. గతేడాది ఆమె నటించిన ‘రూహి’ అనే హారర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఈ లాక్ డౌన్ సమయంలో పలు ఫోటో షూట్లు, పెయింటింగ్ అంటూ కాలక్షేపం చేస్తోంది జాన్వీ.
ఈ మధ్యకాలంలో జాన్వీ తన గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ బికినీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది జాన్వీ. వీటికి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు ఆమెని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. బికినీ ధరించినప్పటికీ ఎక్కడా వల్గారిటీ లేకుండా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
గతంలో ఈ బ్యూటీ ఎక్స్పోజింగ్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తన హద్దుల్లో తాను ఉంటూ, అవసరమైన మేర అందాల ప్రదర్శనకు వెనుకడగు వేయనని చెప్పింది. ప్రస్తుతం జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘దోస్తానా 2’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలానే మరికొన్ని కథలను కూడా వింటోంది. త్వరలోనే ఈమెను టాలీవుడ్ కి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on June 6, 2021 12:47 pm
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు మాత్రమే వచ్చిన వైసీపీ సభ్యులు.. తర్వాత పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో సభకు…
ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ కావడం అన్నది రేర్ ఫీట్. తెలుగులో ఈ రికార్డు నందమూరి…
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…