Movie News

అక్కడ థియేటర్లు తెరుచుకుంటున్నాయ్


గత నెల రోజుల ముందు నుంచి దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్లు మూతపడి ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొంచెం తగ్గింది కానీ.. ముప్పు అయితే తొలగిపోలేదు. సాధారణ పరిస్థితులు రావడానికి ఇంకా సమయం పట్టేలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్లా లాక్ డౌన్ అమలవుతుండగా.. వచ్చే నెల రోజుల్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఆగస్టుకో లేదంటే దసరాకో కానీ థియేటర్లు పున:ప్రారంభం కావని అంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న అంచనాలున్నాయి.

కానీ ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో రాబోయే సోమవారం నుంచి థియేటర్లు పున:ప్రారంభం అవుతుండటం గమనార్హం. 50 శాతం ఆక్యుపెన్సీతో అక్కడ థియేటర్లు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి తీవ్రంగా దెబ్బ తిన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రనే ముందుంటోంది. కేసులు, మరణాల్లో ఆ రాష్ట్రానికి మరే స్టేట్ కూడా దరిదాపుల్లో లేదు. ఒక టైంలో దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింట్లో నమోదైన కేసులు, మరణాలతో సమానంగా మహారాష్ట్రలోనే కేసులు వచ్చాయి, మరణాలు సంభవించాయి. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా అందరికంటే ముందు లాక్ డౌన్ పెట్టింది ఆ రాష్ట్రమే.

ఏడాది నుంచి అక్కడ థియేటర్లు చాలా వరకు మూతపడి ఉన్నాయి. అవి తెరుచుకున్న సమయంలోనూ నామమాత్రంగా నడిచాయి. హిందీలో పేరున్న సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ప్రస్తుత పరిస్థితుల నుంచి కోలుకుని మహారాష్ట్రలో థియేటర్లు ఒకప్పటిలా నడవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా అప్పుడే థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవడానికి అనుమతులివ్వడం ఆశ్చర్యకరమే. ఐతే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎక్కువ దెబ్బ తిన్న మహారాష్ట్ర.. ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల వైరస్ ప్రభావాన్ని తగ్గించగలిగింది. అక్కడ కేసులు, మరణాల సంఖ్య బాగా తగ్గిన నేపథ్యంలోనే లాక్ డౌన్ షరతులు సడలించి థియేటర్లకు అనుమతులిచ్చినట్లు తెలుస్తోంది.

This post was last modified on June 6, 2021 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

51 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

1 hour ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago