ఈ రోజే ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ముందుకు వచ్చింది ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా కంటెంట్ ఉందంటూ అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఐతే ఈ సిరీస్ ఎలా ఉందన్నది పక్కన పెడితే.. తమిళ జనాలు అభ్యంతర పెట్టినట్లుగా వివాదాస్పదంగా ఉందా అన్న ప్రశ్న కూడా అందరినీ వెంటాడుతోంది.
ఈ సిరీస్లో సమంత చేసిన రాజి పాత్ర చుట్టూ వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. ఆమె తమిళ ఈలం (ఎల్టీటీఈ) సభ్యురాలి పాత్రను పోషించగా.. ఎల్టీటీఈ, పాకిస్థాన్ ఉగ్రవాదాలు కలిసి పని చేసినట్లుగా ట్రైలర్లో చూపించడంపై తమిళనాడు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే లంకేయులతో కలిసి ఉండలేమని, తమకు వేరే రాజ్యం కావాలని పోరాడిన తమిళ టైగర్లను ఉగ్రవాదులుగా చూపించడమేంటన్నది వాళ్ల అభ్యంతరం.
ఈ కారణంతోనే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను నిషేధించాలంటూ డిమాండ్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వెళ్లింది. ఈ నేపథ్యంలో నిజంగా ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో తమిళ టైగర్లను చెడుగా చూపించారా అన్న సందేహంతో అందరూ ఉన్నారు. ఐతే నిజానికి ఈ సిరీస్లో తమిళ టైగర్లను నెగెటివ్ కోణంలో ఏమీ చూపించలేదు. లోతుగా కాకపోయినా వాళ్ల బాధల్ని, కష్టాల్ని చర్చించే ప్రయత్నం జరిగింది. వారి కోణంలో కథను చెప్పే ప్రయత్నమూ జరిగింది. కాకపోతే ఇందులో వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం మాత్రం జరిగింది.
తమిళ టైగర్లు ఎప్పుడూ కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసింది లేదు. ఉగ్రవాదులతో కలిసి పని చేస్తే వీళ్లూ ఉగ్రవాదులే అవుతారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కల్పిత కథ అని చెబుతున్నప్పటికీ.. ఇందులో చూపించింది ఎల్టీటీఈ గురించే. సమంత అందులో సభ్యురాలిగానే కనిపించింది. శ్రీలంక ప్రస్తావన చాలాచోట్ల కనిపిస్తుంది. కాబట్టి కల్పిత కథ అని చెబుతూ వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం చేసినట్లుగానే భావించాలి. ఐతే ఇందులో తమిళ టైగర్ల పట్ల సానుభూతి కనిపించింది కాబట్టి తమిళులు మన్నిస్తారేమో చూడాలి. లేదంటే మాత్రం వివాదం పెద్దది కావడం ఖాయం.
This post was last modified on June 4, 2021 2:01 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…