ఈ రోజే ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ముందుకు వచ్చింది ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా కంటెంట్ ఉందంటూ అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఐతే ఈ సిరీస్ ఎలా ఉందన్నది పక్కన పెడితే.. తమిళ జనాలు అభ్యంతర పెట్టినట్లుగా వివాదాస్పదంగా ఉందా అన్న ప్రశ్న కూడా అందరినీ వెంటాడుతోంది.
ఈ సిరీస్లో సమంత చేసిన రాజి పాత్ర చుట్టూ వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. ఆమె తమిళ ఈలం (ఎల్టీటీఈ) సభ్యురాలి పాత్రను పోషించగా.. ఎల్టీటీఈ, పాకిస్థాన్ ఉగ్రవాదాలు కలిసి పని చేసినట్లుగా ట్రైలర్లో చూపించడంపై తమిళనాడు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే లంకేయులతో కలిసి ఉండలేమని, తమకు వేరే రాజ్యం కావాలని పోరాడిన తమిళ టైగర్లను ఉగ్రవాదులుగా చూపించడమేంటన్నది వాళ్ల అభ్యంతరం.
ఈ కారణంతోనే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను నిషేధించాలంటూ డిమాండ్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వెళ్లింది. ఈ నేపథ్యంలో నిజంగా ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో తమిళ టైగర్లను చెడుగా చూపించారా అన్న సందేహంతో అందరూ ఉన్నారు. ఐతే నిజానికి ఈ సిరీస్లో తమిళ టైగర్లను నెగెటివ్ కోణంలో ఏమీ చూపించలేదు. లోతుగా కాకపోయినా వాళ్ల బాధల్ని, కష్టాల్ని చర్చించే ప్రయత్నం జరిగింది. వారి కోణంలో కథను చెప్పే ప్రయత్నమూ జరిగింది. కాకపోతే ఇందులో వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం మాత్రం జరిగింది.
తమిళ టైగర్లు ఎప్పుడూ కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసింది లేదు. ఉగ్రవాదులతో కలిసి పని చేస్తే వీళ్లూ ఉగ్రవాదులే అవుతారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కల్పిత కథ అని చెబుతున్నప్పటికీ.. ఇందులో చూపించింది ఎల్టీటీఈ గురించే. సమంత అందులో సభ్యురాలిగానే కనిపించింది. శ్రీలంక ప్రస్తావన చాలాచోట్ల కనిపిస్తుంది. కాబట్టి కల్పిత కథ అని చెబుతూ వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం చేసినట్లుగానే భావించాలి. ఐతే ఇందులో తమిళ టైగర్ల పట్ల సానుభూతి కనిపించింది కాబట్టి తమిళులు మన్నిస్తారేమో చూడాలి. లేదంటే మాత్రం వివాదం పెద్దది కావడం ఖాయం.
This post was last modified on June 4, 2021 2:01 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…