నటీనటుల పని దర్శకులు చెప్పింది చేసుకుపోవడమే. ఆయా పాత్రల లక్షణాల గురించి వాళ్లను తప్పుబట్టడానికి ఏమీ ఉండదు. విషయం లేదనుకున్న పాత్రలను తిరస్కరించడం చేస్తారు కానీ.. నటులుగా తమకు సవాలు విసిరే పాత్రలు వచ్చినపుడు చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఆ పాత్రలు తమకు ఎంత పేరు తెస్తాయి అని చూస్తారు కానీ.. వాటి తాలూకు వివాదాలతో వాళ్లకు అసలు సంబంధం ఉండదు.
కానీ సినిమాకు సంబంధించి ముఖచిత్రంగా కనిపించేది నటీనటులే కావడంతో పాత్రల తాలూకు వివాదాల్ని వాళ్లకు ఆపాదించి టార్గెట్ చేస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్లో భాగంగా ఆమె చేసిన టెర్రరిస్టు లక్షణాలున్న పాత్ర తనను వివాదంలోకి లాగింది. ట్రైలర్లో సమంత పాత్రను చూడగానే ఆమె ఎల్టీటీఈ సభ్యురాలిగా కనిపించనున్న సంగతి పసిగట్టి తమిళ టైగర్లను టెర్రరిస్టులుగా చూపిస్తారా అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు తమిళులు.
ఫ్యామిలీ మ్యాన్-2 రిలీజయ్యాక స్పందించాలని, తమిళుల మనోభావాలను కించపరిచేలా ఇందులో ఎలాంటి అంశాలుండవని దర్శకులు రాజ్-డీకే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా తమిళ జనాల ఆగ్రహం చల్లారలేదు. తాజాగా షేమ్ ఆన్ యు సమంత అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఆమెను ట్రోల్ చేశారు. సిరీస్ తీసిన దర్శక నిర్మాతలను కాకుండా సమంతను ఇలా టార్గెట్ చేయడం విడ్డూరం.
ఈ సిరీస్ చేసినందుకు గాను సమంత చేసే వేేరే సినిమాలను కూడా బహిష్కరించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. అసలే సమంత పెళ్లి తర్వాత తమిళంలో సినిమాలు బాగా తగ్గించేసింది. సెలెక్టివ్ రోల్స్ ఎంచుకుంటోంది. ఇప్పుడు ఈ వివాదం పుణ్యమా అని కోలీవుడ్లో ఆమె కెరీర్ ముగింపు దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రిలీజై అందులో తమిళులు లేవనెత్తుతున్న అభ్యంతరాలే ఉంటే మాత్రం తమిళంలో సమంత కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే. ఆమెకు అవకాశం ఇచ్చిన వాళ్లను కూడా టార్గెట్ ఇచ్చే అవకాశముంది కాబట్టి.. ఎందుకొచ్చిన వివాదంలే అని ఆమెకు తలుపులు మూసేయడం గ్యారెంటీ.
This post was last modified on June 3, 2021 4:56 pm
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…