‘బ్రహ్మోత్సవం’ లాంటి సినిమా తీసిన తరువాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మరో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం పట్టింది. తమిళంలో సక్సెస్ అందుకున్న ‘అసురన్’ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా కథలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ లాంటి ప్రాజెక్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయంలో చాలా మందికి సందేహాలు కలిగాయి. కానీ ఇప్పటివరకు విడుదలైన ఫోటోలు, మోషన్ పోస్టర్లు చూసిన వారికి సినిమా బాగా వచ్చి ఉంటుందనే నమ్మకం కలుగుతోంది.
దీంతో ‘కర్ణన్’ రీమేక్ కోసం కూడా శ్రీకాంత్ అడ్డాలను తీసుకోవాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి కథ చెప్పమని అడిగారట. గతంలో దిల్ రాజు-శ్రీకాంత్ అడ్డాల కలిసి రెండు సినిమాలకు పని చేశారు. ఆ రెండూ కూడా మంచి విజయాలను సాధించాయి. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడొక సమస్య ఉంది.
అదేంటంటే.. శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం క్రితం గీతాఆర్ట్స్ సంస్థ నుండి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ‘నారప్ప’ తరువాత తమతో సినిమా చేయమని గీతాఆర్ట్స్ సంస్థ శ్రీకాంత్ అడ్డాలను అడుగుతుందట. దీంతో ప్రస్తుతం ఆయన ఏ నిర్మాణ సంస్థకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ఇదే విషయం దిల్ రాజుకి కూడా చెప్పినట్లు సమాచారం. ఆ సమస్యను ఎలాగైనా పరిష్కరించుకొని తన బ్యానర్ లో సినిమాకి రెడీ అవ్వమని సలహా ఇచ్చారట దిల్ రాజు. పైగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా ఆఫర్ చేయడం విశేషం. శ్రీకాంత్ గనుక తన కథతో మెప్పిస్తే సినిమా పట్టాలెక్కడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on June 3, 2021 5:27 pm
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…