‘బ్రహ్మోత్సవం’ లాంటి సినిమా తీసిన తరువాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మరో సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం పట్టింది. తమిళంలో సక్సెస్ అందుకున్న ‘అసురన్’ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా కథలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ లాంటి ప్రాజెక్ట్ ను ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయంలో చాలా మందికి సందేహాలు కలిగాయి. కానీ ఇప్పటివరకు విడుదలైన ఫోటోలు, మోషన్ పోస్టర్లు చూసిన వారికి సినిమా బాగా వచ్చి ఉంటుందనే నమ్మకం కలుగుతోంది.
దీంతో ‘కర్ణన్’ రీమేక్ కోసం కూడా శ్రీకాంత్ అడ్డాలను తీసుకోవాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా శ్రీకాంత్ అడ్డాలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి కథ చెప్పమని అడిగారట. గతంలో దిల్ రాజు-శ్రీకాంత్ అడ్డాల కలిసి రెండు సినిమాలకు పని చేశారు. ఆ రెండూ కూడా మంచి విజయాలను సాధించాయి. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడొక సమస్య ఉంది.
అదేంటంటే.. శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం క్రితం గీతాఆర్ట్స్ సంస్థ నుండి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ‘నారప్ప’ తరువాత తమతో సినిమా చేయమని గీతాఆర్ట్స్ సంస్థ శ్రీకాంత్ అడ్డాలను అడుగుతుందట. దీంతో ప్రస్తుతం ఆయన ఏ నిర్మాణ సంస్థకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ఇదే విషయం దిల్ రాజుకి కూడా చెప్పినట్లు సమాచారం. ఆ సమస్యను ఎలాగైనా పరిష్కరించుకొని తన బ్యానర్ లో సినిమాకి రెడీ అవ్వమని సలహా ఇచ్చారట దిల్ రాజు. పైగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా ఆఫర్ చేయడం విశేషం. శ్రీకాంత్ గనుక తన కథతో మెప్పిస్తే సినిమా పట్టాలెక్కడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on June 3, 2021 5:27 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…