Movie News

సినిమాలకు గుడ్ బై చెప్పిన అబ్బాస్ ఇప్పుడెక్కడ? ఏం చేస్తున్నాడంటే?

70-80 మధ్య పుట్టిన వారికి.. తొంభైలకు యూత్ లో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అబ్బాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. తన అందంతో.. స్కిన్ టోన్ తో ఎంతోమంది అమ్మాయిలకు నిద్ర లేకుండా చేసిన ఈ కలల రాకుమారుడు..కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. తొంభైలలో వచ్చిన ప్రేమదేశం మూవీ అప్పట్లో పెను సంచలనం. అప్పటి యూత్ ఏమాత్రం ఆలోచించలేని కాన్సెప్టును తీసుకొని తీసిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి.. స్వల్ప వ్యవధిలో హీరోగా.. విలన్ గా యాభై సినిమాలు చేసిన అబ్బాస్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. మరి.. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే.. సినీ పరిశ్రమకు దూరంగా ఉండటమే దీనికి కారణం. కొంతకాలంగా అందుబాటులో లేని ఆయన ఈ మధ్యనే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ లో నివసిస్తున్న అబ్బాస్.. పూర్తిగా న్యూజిలాండ్ వాసిగా మారిపోయారు. కుటుంబంతో సహా సెటిల్ అయిపోయిన అతను ఇప్పుడా దేశంలో మోటివేషనల్ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గి.. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న అతడు.. తీవ్రమైన డిప్రెషన్ లోకి కూరుకుపోయాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి.. ఆపై న్యూజిలాండ్ లో ల్యాండ్ అయ్యాడు.

అక్కడికి వెళ్లిన కొత్తల్లో పెట్రోల్ బంకుల్లో పని చేశాడు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ గా మారి.. వేలాది మందిలో కొత్త స్పూర్తిని నింపుతున్నారు. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఇతగాడి రియల్ స్టోరీతో ఏకంగా సినిమానే తీసేందుకు సరిపడా కథ ఉందని చెప్పక తప్పదు.

This post was last modified on June 8, 2021 3:18 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

5 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago