Movie News

సినిమాలకు గుడ్ బై చెప్పిన అబ్బాస్ ఇప్పుడెక్కడ? ఏం చేస్తున్నాడంటే?

70-80 మధ్య పుట్టిన వారికి.. తొంభైలకు యూత్ లో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అబ్బాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. తన అందంతో.. స్కిన్ టోన్ తో ఎంతోమంది అమ్మాయిలకు నిద్ర లేకుండా చేసిన ఈ కలల రాకుమారుడు..కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. తొంభైలలో వచ్చిన ప్రేమదేశం మూవీ అప్పట్లో పెను సంచలనం. అప్పటి యూత్ ఏమాత్రం ఆలోచించలేని కాన్సెప్టును తీసుకొని తీసిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి.. స్వల్ప వ్యవధిలో హీరోగా.. విలన్ గా యాభై సినిమాలు చేసిన అబ్బాస్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. మరి.. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే.. సినీ పరిశ్రమకు దూరంగా ఉండటమే దీనికి కారణం. కొంతకాలంగా అందుబాటులో లేని ఆయన ఈ మధ్యనే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ లో నివసిస్తున్న అబ్బాస్.. పూర్తిగా న్యూజిలాండ్ వాసిగా మారిపోయారు. కుటుంబంతో సహా సెటిల్ అయిపోయిన అతను ఇప్పుడా దేశంలో మోటివేషనల్ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గి.. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న అతడు.. తీవ్రమైన డిప్రెషన్ లోకి కూరుకుపోయాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి.. ఆపై న్యూజిలాండ్ లో ల్యాండ్ అయ్యాడు.

అక్కడికి వెళ్లిన కొత్తల్లో పెట్రోల్ బంకుల్లో పని చేశాడు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ గా మారి.. వేలాది మందిలో కొత్త స్పూర్తిని నింపుతున్నారు. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఇతగాడి రియల్ స్టోరీతో ఏకంగా సినిమానే తీసేందుకు సరిపడా కథ ఉందని చెప్పక తప్పదు.

This post was last modified on June 8, 2021 3:18 pm

Share

Recent Posts

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

1 hour ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

3 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

8 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

9 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

9 hours ago

ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి

దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…

9 hours ago