70-80 మధ్య పుట్టిన వారికి.. తొంభైలకు యూత్ లో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అబ్బాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. తన అందంతో.. స్కిన్ టోన్ తో ఎంతోమంది అమ్మాయిలకు నిద్ర లేకుండా చేసిన ఈ కలల రాకుమారుడు..కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. తొంభైలలో వచ్చిన ప్రేమదేశం మూవీ అప్పట్లో పెను సంచలనం. అప్పటి యూత్ ఏమాత్రం ఆలోచించలేని కాన్సెప్టును తీసుకొని తీసిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి.. స్వల్ప వ్యవధిలో హీరోగా.. విలన్ గా యాభై సినిమాలు చేసిన అబ్బాస్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. మరి.. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే.. సినీ పరిశ్రమకు దూరంగా ఉండటమే దీనికి కారణం. కొంతకాలంగా అందుబాటులో లేని ఆయన ఈ మధ్యనే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ లో నివసిస్తున్న అబ్బాస్.. పూర్తిగా న్యూజిలాండ్ వాసిగా మారిపోయారు. కుటుంబంతో సహా సెటిల్ అయిపోయిన అతను ఇప్పుడా దేశంలో మోటివేషనల్ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గి.. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న అతడు.. తీవ్రమైన డిప్రెషన్ లోకి కూరుకుపోయాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి.. ఆపై న్యూజిలాండ్ లో ల్యాండ్ అయ్యాడు.
అక్కడికి వెళ్లిన కొత్తల్లో పెట్రోల్ బంకుల్లో పని చేశాడు. అనంతరం మోటివేషనల్ స్పీకర్ గా మారి.. వేలాది మందిలో కొత్త స్పూర్తిని నింపుతున్నారు. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఇతగాడి రియల్ స్టోరీతో ఏకంగా సినిమానే తీసేందుకు సరిపడా కథ ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on June 8, 2021 3:18 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…