పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభం నుంచి పెద్ద రైటర్లు, దర్శకులతో పని చేసిన సందర్భాలు తక్కువగా కనిపిస్తాయి. త్రివిక్రమ్ కూడా రెండు సినిమాల అనుభవంతో ఉన్నపుడే పవన్తో జట్టు కట్టాడు. ఆయనతో వ్యక్తిగతంగానూ కుదిరిన స్నేహం వల్ల ఇంకో రెండు సినిమాలు చేశాడు కానీ.. స్టార్ దర్శకులకు చాలా వరకు దూరంగానే ఉంటాడు పవన్. ఆయనకున్న ఇమేజ్కి విజయేంద్ర ప్రసాద్ లాంటి రైటర్ కథ రాస్తే.. రాజమౌళి లాంటి దర్శకుడు దాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేస్తుంటుంది. మరి ఇదే మాట విజయేంద్ర ప్రసాద్ దగ్గర ప్రస్తావిస్తే ఆయనేమన్నారో తెలుసా..?
పవన్ కళ్యాణ్ ఒక డైనమైట్ అని.. చిన్న నిప్పురవ్వ అతడికి చాలని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. పవన్తో సినిమా తీయాలంటే ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం కూడా లేదని.. కేవలం ఆయన్ని చూడ్డానికే జనాలు థియేటర్లకు వస్తారని ఆయనన్నారు. ఇప్పటిదాకా పవన్ చేసిన సినిమాల నుంచి ఒక్కో ముక్క తీసుకొచ్చి పెట్టేసి పాటలు, ఫైట్లు పెట్టేస్తే సినిమా వర్కవుట్ అయిపోతుందని విజయేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ ఎలివేషన్ చూసి పవన్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. దీని మీద మీమ్స్ చేసి సోషల్ మీడియా పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్ పవన్కు ఇలాంటి ఎలివేషన్ ఇవ్వడం కొత్త కాదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘బాహుబలి: ది కంక్లూజన్’లో ఇంటర్వెల్ సీన్ ఎంత ఉద్వేగభరితంగా ఉంటుందో తెలిసిందే. హీరో ఎలివేషన్ అంటే అంతకుమించిన సన్నివేశం కనిపించదు. ఆ సన్నివేశానికి పరోక్షంగా పవన్ కళ్యాణే స్ఫూర్తి అని ఆయన గతంలో వెల్లడించారు. ఒక సినిమా వేడుక సందర్భంగా వేదిక మీద ఉన్న వాళ్లు పవన్ పేరెత్తినపుడల్లా అభిమానులు ఆడిటోరియాన్ని హోరెత్తించేయడం చూసి.. దాని స్ఫూర్తితో ఈ సన్నివేశం రాసినట్లు ఆయన చెప్పడం పవన్ అభిమానులకు అమితంగా నచ్చేసింది.
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…