అది 2007. ‘దేవదాసు’ సినిమాతో భారీ విజయాన్నందుకున్న వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఒక్కమగాడు’ అనే పవర్ ఫుల్ టైటిల్తో సినిమా అనౌన్స్ చేయగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం. సినిమా మేకింగ్ దశలో, రిలీజ్ ముంగిట ఈ సినిమా గురించి ఎంతో చర్చ. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందనే అంచనాల మధ్య తర్వాతి ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మార్నింగ్ షో పడగానే అంతటా హాహాకారాలు. నందమూరి అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. పూర్తి సినిమా చూడలేక అల్లాడిపోయారు.
వైవీఎస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశాడేంటంటూ అతడికి శాపనార్థాలు పెట్టారు. బాలయ్య కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా చిత్రం. సినిమా రిలీజయ్యాక చౌదరి నోటికి తాళం పడిపోయింది. ‘ఒక్క మగాడు’ గురించి మాట్లాడ్డానికే భయపడ్డాడు.
ఐతే ఈ మధ్య మరీ సైలెంట్ అయిపోయిన చౌదరి.. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా, తర్వాత ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో మీడియాతో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన ట్విట్టర్లో ఎన్టీఆర్ మీద పెట్టిన ఒక స్పేస్లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘ఒక్కమగాడు’ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ఆ సినిమా విషయంలో తాను చేసిన తప్పేంటో ఆయన వివరించాడు.
‘ఒక్క మగాడు’కు ముందు బాలయ్య చేసిన కొన్ని సినిమాల్లో ఉన్న విపరీతమైన వయొలెన్స్, డబుల్ మీనింగ్ పాటలు.. ‘‘నేను నరికానంటే ఏ ముక్క ఎక్కడ పడిందో వెతుక్కోవడానికి వారం పడుతుంది’’ లాంటి డైలాగుల వల్ల ఆయన యూత్కు దూరం అయిపోయారని.. సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన కామెడీ నడిచిందని.. అందుకే హింస లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్, సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్కు నచ్చేలా ఒక కాజ్ కోసం కథ నడిచేలా, ఒక ప్రాపర్ సినిమా తీయాలని అనుకున్నానని.. ఈ ఆలోచనే పెద్ద తప్పు అయిందని, అందువల్లే ‘ఒక్క మగాడు’ దెబ్బ తిందని చౌదరి అన్నాడు. కానీ ‘ఒక్క మగాడు’ చూశామంటే చౌదరి ఏవైతే వద్దు అనుకున్నాడో అవే ఉంటాయి. విపరీతమైన వయొలెన్స్, డబుల్ మీనింగ్ మాటలు, పాటలే కనిపిస్తాయి సినిమా అంతా. ముఖ్యంగా హీరోయిన్లను చాలా వల్గర్గా చూపించి, విపరీతమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్, సీన్స్, సాంగ్స్ పెట్టి ఫ్యామిలీస్తో సినిమా చూడలేని విధంగా తయారు చేసిన చౌదరి.. ఇప్పుడిలా మాట్లాడ్డం విడ్డూరం.
This post was last modified on May 31, 2021 8:46 am
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…