అది 2007. ‘దేవదాసు’ సినిమాతో భారీ విజయాన్నందుకున్న వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘ఒక్కమగాడు’ అనే పవర్ ఫుల్ టైటిల్తో సినిమా అనౌన్స్ చేయగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం. సినిమా మేకింగ్ దశలో, రిలీజ్ ముంగిట ఈ సినిమా గురించి ఎంతో చర్చ. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందనే అంచనాల మధ్య తర్వాతి ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మార్నింగ్ షో పడగానే అంతటా హాహాకారాలు. నందమూరి అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. పూర్తి సినిమా చూడలేక అల్లాడిపోయారు.
వైవీఎస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశాడేంటంటూ అతడికి శాపనార్థాలు పెట్టారు. బాలయ్య కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా చిత్రం. సినిమా రిలీజయ్యాక చౌదరి నోటికి తాళం పడిపోయింది. ‘ఒక్క మగాడు’ గురించి మాట్లాడ్డానికే భయపడ్డాడు.
ఐతే ఈ మధ్య మరీ సైలెంట్ అయిపోయిన చౌదరి.. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా, తర్వాత ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో మీడియాతో మాట్లాడి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన ట్విట్టర్లో ఎన్టీఆర్ మీద పెట్టిన ఒక స్పేస్లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘ఒక్కమగాడు’ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ఆ సినిమా విషయంలో తాను చేసిన తప్పేంటో ఆయన వివరించాడు.
‘ఒక్క మగాడు’కు ముందు బాలయ్య చేసిన కొన్ని సినిమాల్లో ఉన్న విపరీతమైన వయొలెన్స్, డబుల్ మీనింగ్ పాటలు.. ‘‘నేను నరికానంటే ఏ ముక్క ఎక్కడ పడిందో వెతుక్కోవడానికి వారం పడుతుంది’’ లాంటి డైలాగుల వల్ల ఆయన యూత్కు దూరం అయిపోయారని.. సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన కామెడీ నడిచిందని.. అందుకే హింస లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్, సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్కు నచ్చేలా ఒక కాజ్ కోసం కథ నడిచేలా, ఒక ప్రాపర్ సినిమా తీయాలని అనుకున్నానని.. ఈ ఆలోచనే పెద్ద తప్పు అయిందని, అందువల్లే ‘ఒక్క మగాడు’ దెబ్బ తిందని చౌదరి అన్నాడు. కానీ ‘ఒక్క మగాడు’ చూశామంటే చౌదరి ఏవైతే వద్దు అనుకున్నాడో అవే ఉంటాయి. విపరీతమైన వయొలెన్స్, డబుల్ మీనింగ్ మాటలు, పాటలే కనిపిస్తాయి సినిమా అంతా. ముఖ్యంగా హీరోయిన్లను చాలా వల్గర్గా చూపించి, విపరీతమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్, సీన్స్, సాంగ్స్ పెట్టి ఫ్యామిలీస్తో సినిమా చూడలేని విధంగా తయారు చేసిన చౌదరి.. ఇప్పుడిలా మాట్లాడ్డం విడ్డూరం.
This post was last modified on May 31, 2021 8:46 am
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…