చాందిని అనే చిన్న స్థాయి తమిళ నటి వ్యవహారం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే సారథ్యంలో మంత్రిగా పని చేసిన మణికందన్ అనే నాయకుడిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఐదేళ్లకు పైగా తనతో సహజీవనం చేసిన మణికందన్.. తనను అన్ని రకాలుగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడని ఆమె ఆరోపించింది. మీడియా ముందుకొచ్చి తమ బంధం గురించి ఫొటో ఆధారాలు చూపించి మరీ ఆమె ఈ ఆరోపణలు చేసింది.
తెలుగులోకి ‘శంభో శివ శంభో’ పేరుతో రీమేక్ అయిన తమిళ సినిమా ‘నాడోడిగల్’ సహా కొన్ని సినిమాల్లో చాందిని నటించింది. గత కొన్నేళ్లలో ఆమె అంత లైమ్ లైట్లో ఏమీ లేదు. కాగా మంత్రి మణికందన్ను ఒక కార్యక్రమంలో భాగంగా కలిశానని.. తర్వాత తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. తమ మధ్య శారీరక సంబంధం కూడా మొదలైందని.. తరచుగా ఆయన బంగ్లాకు వెళ్లి వస్తుండేదాన్ననని చాందిని వెల్లడించింది.
ఐతే తర్వాత ఇద్దరం ఒక ఇల్లు అద్దకు తీసుకుని అందులో సహజీవనం చేశామని.. భార్యతో తనకు సరైన సంబంధాలు లేవని, ఇబ్బందులున్నాయని.. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికందన్ చెప్పాడని.. దీంతో ఆయనతో ఇన్నేళ్లుగా కలిసి ఉన్నానని.. కానీ ఇప్పుడు ఆయన అడ్డం తిరిగాడని చాందిని ఆరోపించింది. తనతో మణికందన్కు సంబంధం ఉన్న సంగతి ఆయన భార్య సహా కుటుంబ సభ్యులందరికీ తెలుసని ఆమె చెప్పింది.
మణికందన్ కారణంగా తాను గర్భవతిని కూడా అయ్యానని.. ఐతే పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ అయితే సమాజం మరోలా చూస్తుందని చెప్పి తన మిత్రుడికి చెందిన ఆసుపత్రిలో అబార్షన్ చేయించారని ఆమె చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అయినప్పటి రిపోర్ట్ను కూడా చాందిని మీడియాకు చూపించింది. అలాగే మణికందన్ తనను కొట్టడం వల్ల గాయాలై చికిత్స తీసుకున్నప్పటి ఫొటోలు, రిపోర్టులను కూడా ఆమె బయటపెట్టింది. వీటితో పాటు మణికందన్ తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి.. తనకు న్యాయం చేయాలని మీడియాను కోరింది.
This post was last modified on May 29, 2021 7:45 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…