చాందిని అనే చిన్న స్థాయి తమిళ నటి వ్యవహారం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే సారథ్యంలో మంత్రిగా పని చేసిన మణికందన్ అనే నాయకుడిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఐదేళ్లకు పైగా తనతో సహజీవనం చేసిన మణికందన్.. తనను అన్ని రకాలుగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడని ఆమె ఆరోపించింది. మీడియా ముందుకొచ్చి తమ బంధం గురించి ఫొటో ఆధారాలు చూపించి మరీ ఆమె ఈ ఆరోపణలు చేసింది.
తెలుగులోకి ‘శంభో శివ శంభో’ పేరుతో రీమేక్ అయిన తమిళ సినిమా ‘నాడోడిగల్’ సహా కొన్ని సినిమాల్లో చాందిని నటించింది. గత కొన్నేళ్లలో ఆమె అంత లైమ్ లైట్లో ఏమీ లేదు. కాగా మంత్రి మణికందన్ను ఒక కార్యక్రమంలో భాగంగా కలిశానని.. తర్వాత తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. తమ మధ్య శారీరక సంబంధం కూడా మొదలైందని.. తరచుగా ఆయన బంగ్లాకు వెళ్లి వస్తుండేదాన్ననని చాందిని వెల్లడించింది.
ఐతే తర్వాత ఇద్దరం ఒక ఇల్లు అద్దకు తీసుకుని అందులో సహజీవనం చేశామని.. భార్యతో తనకు సరైన సంబంధాలు లేవని, ఇబ్బందులున్నాయని.. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికందన్ చెప్పాడని.. దీంతో ఆయనతో ఇన్నేళ్లుగా కలిసి ఉన్నానని.. కానీ ఇప్పుడు ఆయన అడ్డం తిరిగాడని చాందిని ఆరోపించింది. తనతో మణికందన్కు సంబంధం ఉన్న సంగతి ఆయన భార్య సహా కుటుంబ సభ్యులందరికీ తెలుసని ఆమె చెప్పింది.
మణికందన్ కారణంగా తాను గర్భవతిని కూడా అయ్యానని.. ఐతే పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ అయితే సమాజం మరోలా చూస్తుందని చెప్పి తన మిత్రుడికి చెందిన ఆసుపత్రిలో అబార్షన్ చేయించారని ఆమె చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అయినప్పటి రిపోర్ట్ను కూడా చాందిని మీడియాకు చూపించింది. అలాగే మణికందన్ తనను కొట్టడం వల్ల గాయాలై చికిత్స తీసుకున్నప్పటి ఫొటోలు, రిపోర్టులను కూడా ఆమె బయటపెట్టింది. వీటితో పాటు మణికందన్ తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపించి.. తనకు న్యాయం చేయాలని మీడియాను కోరింది.
This post was last modified on May 29, 2021 7:45 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…