రూ.325 కోట్లకు ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. ఇండియాలో ఒక సినిమాకు ఓవరాల్గా ఇంత బిజినెస్ జరిగినా కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండగా.. కేవలం డిజిటల్ రైట్స్కే ఇంత రేటు పలకడం అంటే మామూలు విషయం కాదు. ‘జీ’ నెట్ వర్క్ అన్ని భాషలకూ కలిపి ‘ఆర్ఆర్ఆర్’ రైట్స్ను సొంతం చేసుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం ఈ వార్త కనిపిస్తోంది. ఈ సమాచారం వైరల్ అవుతున్న తీరు చూస్తుంటే డీల్ నిజమే అనిపిస్తోంది.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ ‘జీ’ నెట్ వర్క్ సొంతం కావడం చాలామంది ప్రేక్షకులకు రుచించడం లేదు. సోషల్ మీడియాలో దీని పట్ల ఎక్కువమంది నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి పాపులర్ ఓటీటీల్లో ఏదో ఒకదానికి రైట్స్ ఇవ్వాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ ఓటీటీలు అయితే తాము కొన్న సినిమాను సబ్స్క్రిప్షన్ ఉన్న ప్రేక్షకులకు ఉచితంగా చూపిస్తాయి. పైగా ఇండియాలో ఈ మూడు ఓటీటీలకే ఎక్కువగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఓటీటీలకు అలవాటు పడ్డ వారు మాండేటరీగా సబ్స్క్రిప్షన్ తీసుకునే ఫ్లాట్ ఫామ్లు ఇవి. ‘జీ’ నెట్ వర్క్ విషయానికి వస్తే.. అది హిందీ ప్రేక్షకుల్లో మాత్రమే పాపులర్. సౌత్లో దానికంత ఆదరణ లేదు. పైగా అది కొత్త సినిమాలను ఎక్కువగా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తుంటుంది. ఆల్రెడీ థియేటర్లలో రిలీజైన చిత్రాలకు సైతం రేటు పెడుతుంటుంది. ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాలను ప్రీమియం కేటగిరీలో పెట్టి సబ్స్క్రిప్షన్కు ఎక్కువ ధర పెడుతుంది. ‘జీ’ వాళ్లకు ఇవ్వడం వల్ల థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాకు రీచ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐతే నిర్మాతలు తమకు అత్యధిక రేటు ఎవరిస్తారు అని చూస్తారు తప్ప.. ఏ ఓటీటీలో రిలీజ్ చేశారన్నది వారికి అప్రధానం. కాగా అమేజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు సైతం ‘ఆర్ఆర్ఆర్’ హక్కుల కోసం పోటీ పడ్డాయని.. అవి రూ.300 కోట్ల దాకా ఇవ్వడానికి ముందుకొచ్చాయని.. కానీ వాటిని మించి రూ.25 కోట్లు ఎక్కువ రేటు చెప్పడంతో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత వాళ్లకే హక్కులు ఇచ్చాడని అంటున్నారు.
This post was last modified on May 22, 2021 9:05 am
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…