కృతి శెట్టి.. గత ఏడాది కాలంలో తెలుగులో ఈ అమ్మాయి గురించి జరిగినంత చర్చ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల గురించి కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఉప్పెన’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన కృతి పేరు.. ఈ సినిమా విడుదల కాకముందే జనాల నోళ్లలో బాగా నానింది. ఈ సినిమా ప్రోమోల్లో ఆమె లుక్స్.. తన హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకు హైప్ రావడంలో కృతి పాత్ర కూడా కీలకమే. అందుకే ‘ఉప్పెన’ ప్రేక్షకులను పలకరించడానికి ముందే ఆమెకు వేరే చిత్రాల్లో అవకాశాలు మొదలైపోయాయి.
నాని చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలోనూ కృతి కథానాయికగా ఎంపికవడం తెలిసిందే. ఇక రిలీజ్ తర్వాత ఆమె పేరు మరింతగా మార్మోగింది. కృతి డిమాండ్ మరింతగా పెరిగింది. రామ్ కొత్త చిత్రానికి కూడా కృతిని కథానాయికగా ఎంచుకున్నారు.
ఐతే ఇవి కాక వేరే ప్రాజెక్టుల్లోనూ కృతి హీరోయిన్ అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. తమిళ స్టార్ సూర్య సినిమాలోనూ కృతికి ఛాన్స్ వచ్చిందన్నారు. ఐతే తన గురించి ఇలాంటి ప్రచారాలు మీడియాలో జోరుగా సాగిపోతుండటంతో కృతి ట్విట్టర్లో స్పందించింది.
‘‘నా కొత్త సినిమాల గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. నాని, సుధీర్ బాబు, రామ్లకు జోడీగా నటిస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టి పూర్తిగా ఈ మూడు చిత్రాల మీదే ఉంది. నేను కొత్త సినిమాలు ఒప్పుకుంటే కచ్చితంగా వాటి నుంచి నేనే వెల్లడిస్తా. ఈ కష్ట కాలంలో అందరూ సురక్షితంగా ఉండండి. మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ ట్వీట్ చేసింది కృతి. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి కృతికి ఏడాది దాకా సమయం పడుతుంది. అవయ్యాకే కొత్త సినిమాలకు సంతకం చేసేలా ఉంది ‘ఉప్పెన’ భామ.
This post was last modified on May 18, 2021 5:03 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…