కృతి శెట్టి.. గత ఏడాది కాలంలో తెలుగులో ఈ అమ్మాయి గురించి జరిగినంత చర్చ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల గురించి కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఉప్పెన’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన కృతి పేరు.. ఈ సినిమా విడుదల కాకముందే జనాల నోళ్లలో బాగా నానింది. ఈ సినిమా ప్రోమోల్లో ఆమె లుక్స్.. తన హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకు హైప్ రావడంలో కృతి పాత్ర కూడా కీలకమే. అందుకే ‘ఉప్పెన’ ప్రేక్షకులను పలకరించడానికి ముందే ఆమెకు వేరే చిత్రాల్లో అవకాశాలు మొదలైపోయాయి.
నాని చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలోనూ కృతి కథానాయికగా ఎంపికవడం తెలిసిందే. ఇక రిలీజ్ తర్వాత ఆమె పేరు మరింతగా మార్మోగింది. కృతి డిమాండ్ మరింతగా పెరిగింది. రామ్ కొత్త చిత్రానికి కూడా కృతిని కథానాయికగా ఎంచుకున్నారు.
ఐతే ఇవి కాక వేరే ప్రాజెక్టుల్లోనూ కృతి హీరోయిన్ అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. తమిళ స్టార్ సూర్య సినిమాలోనూ కృతికి ఛాన్స్ వచ్చిందన్నారు. ఐతే తన గురించి ఇలాంటి ప్రచారాలు మీడియాలో జోరుగా సాగిపోతుండటంతో కృతి ట్విట్టర్లో స్పందించింది.
‘‘నా కొత్త సినిమాల గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. నాని, సుధీర్ బాబు, రామ్లకు జోడీగా నటిస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టి పూర్తిగా ఈ మూడు చిత్రాల మీదే ఉంది. నేను కొత్త సినిమాలు ఒప్పుకుంటే కచ్చితంగా వాటి నుంచి నేనే వెల్లడిస్తా. ఈ కష్ట కాలంలో అందరూ సురక్షితంగా ఉండండి. మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ ట్వీట్ చేసింది కృతి. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి కృతికి ఏడాది దాకా సమయం పడుతుంది. అవయ్యాకే కొత్త సినిమాలకు సంతకం చేసేలా ఉంది ‘ఉప్పెన’ భామ.
This post was last modified on May 18, 2021 5:03 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…