రాజ్ నిడిమోరు-కృష్ణ డీకే.. షార్ట్గా చెప్పాలంటే రాజ్-డీకే.. బాలీవుడ్లో మంచి పేరున్న దర్శక ద్వయం. స్వీయ దర్శకత్వంలో ఫ్లేవర్స్, 99, షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ లాంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న ఈ దర్శకులు.. నిర్మాతలుగా ‘స్త్రీ’ లాంటి భారీ విజయాన్నందుకున్నారు. ఇక వీళ్లు తీసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. అమేజాన్ ప్రైమ్ కోసం చేసిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ మరో ఎత్తు.
ఇండియాలో బిగ్గెస్ట్ హిట్టయిన వెబ్ సిరీస్ ఇదే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఈ సిరీస్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రాజ్-డీకే ద్వయం సిద్ధమవుతోంది. ఐతే రాజ్-డీకే తెలుగు వాళ్లే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచే ఈ ఇద్దరూ వచ్చారు. ఐతే ఇద్దరూ ముంబయిలో కలిశారు. అక్కడే దర్శకులుగా అవకాశాలందుకున్నారు. మంచి స్థాయికి చేరుకున్నారు.
ఐతే తెలుగు వాళ్లయిన ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటిదాకా తెలుగులో సినిమా తీయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో తమ దర్శకత్వంలో వచ్చిన ‘షోర్ ఇన్ ద సిటీ’లో ఓ కీలక పాత్ర చేసిన సందీప్ కిషన్ను పెట్టి హీరో నానితో కలిసి ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేశారు. కానీ అది సరైన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు నెట్ ఫ్లిక్స్లో రిలీజై మంచి స్పందన అందుకుంటున్న ‘సినిమా బండి’ లాంటి ఇండీ ఫిలింను ప్రొడ్యూస్ చేశారు.
మరి తెలుగులో దర్శకత్వం మాటేంటి అని రాజ్-డీకేలను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఇక్కడ సినిమా చేయాలనే ప్రయత్నం ఎప్పట్నుంచో చేస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతోనూ తాము టచ్లో ఉన్నామన్నారు. త్వరలోనే దర్శకులుగా తెలుగులో సినిమా తీస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
This post was last modified on May 16, 2021 2:26 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…