Movie News

తెలుగు దర్శకులు తెలుగు సినిమా చేయరా?

రాజ్ నిడిమోరు-కృష్ణ డీకే.. షార్ట్‌గా చెప్పాలంటే రాజ్-డీకే.. బాలీవుడ్లో మంచి పేరున్న దర్శక ద్వయం. స్వీయ దర్శకత్వంలో ఫ్లేవర్స్, 99, షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ లాంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న ఈ దర్శకులు.. నిర్మాతలుగా ‘స్త్రీ’ లాంటి భారీ విజయాన్నందుకున్నారు. ఇక వీళ్లు తీసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. అమేజాన్ ప్రైమ్ కోసం చేసిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ మరో ఎత్తు.

ఇండియాలో బిగ్గెస్ట్ హిట్టయిన వెబ్ సిరీస్ ఇదే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం ఈ సిరీస్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రాజ్-డీకే ద్వయం సిద్ధమవుతోంది. ఐతే రాజ్-డీకే తెలుగు వాళ్లే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచే ఈ ఇద్దరూ వచ్చారు. ఐతే ఇద్దరూ ముంబయిలో కలిశారు. అక్కడే దర్శకులుగా అవకాశాలందుకున్నారు. మంచి స్థాయికి చేరుకున్నారు.

ఐతే తెలుగు వాళ్లయిన ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటిదాకా తెలుగులో సినిమా తీయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో తమ దర్శకత్వంలో వచ్చిన ‘షోర్ ఇన్ ద సిటీ’లో ఓ కీలక పాత్ర చేసిన సందీప్ కిషన్‌ను పెట్టి హీరో నానితో కలిసి ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేశారు. కానీ అది సరైన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై మంచి స్పందన అందుకుంటున్న ‘సినిమా బండి’ లాంటి ఇండీ ఫిలింను ప్రొడ్యూస్ చేశారు.

మరి తెలుగులో దర్శకత్వం మాటేంటి అని రాజ్-డీకేలను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఇక్కడ సినిమా చేయాలనే ప్రయత్నం ఎప్పట్నుంచో చేస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతోనూ తాము టచ్‌లో ఉన్నామన్నారు. త్వరలోనే దర్శకులుగా తెలుగులో సినిమా తీస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.

This post was last modified on May 16, 2021 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago