Movie News

నేను చనిపోలేదు.. పడుకున్నానంతే


కరోనా వేళ ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ఉన్నట్లుండి కన్ను మూస్తున్నారు. ఒకప్పుడైతే ఇలాంటి వార్తలు చూస్తే ఆశ్చర్యపోయేవాళ్లు. షాకయ్యేవాళ్లు. నమ్మశక్యంగా అనిపించేది కాదు. కానీ ఇలాంటి మరణాలు మామూలైపోతుండటంతో జనాలు కూడా అలవాటు పడిపోతున్నారు. ఒక నిమిషం నిట్టూర్చి అయ్యో అనుకుని ముందుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఫేక్ వార్తలు కూడా నిజాలుగా చలామణి అయిపోతున్నాయి.

గత ఏడాది కాలంలో ఇలా సోషల్ మీడియాలో ప్రచారమైన అబద్ధపు చావులు చాలానే ఉన్నాయి. సింగర్ లక్కీ అలీతో పాటు నటుడు ముకేష్ ఖన్నా చనిపోయినట్లు ఇటీవల జోరుగా ప్రచారాలు సాగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు అబద్ధం అంటూ వాళ్లు స్వయంగా వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది పాపం. ఇప్పుడు ఈ కోవలోనే సీనియర్ నటుడు పరేష్ రావల్ సైతం చెప్పుకోవాల్సి వచ్చింది.

తాను మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచయారాన్ని పరేష్ రావల్‌ ఖండించారు. ‘‘నేను చనిపోలేదు ఎక్కువ సేపు నిద్రపోయానంతే’’ అంటు ఆయన స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేష్ రావల్‌ మరణించినట్లుగా ట్విటర్లో ఓ నెటిజన్‌ పోస్టు షేర్‌ చేశాడు. అది కాసేపటికే జోరుగా ప్రచారంలోకి వెళ్లిపోయింది.

ఈ విషయం రావల్ వరకు వచ్చి.. ఆయన స్పందించారు. ‘‘నా గురించి అపోహ కలిగించిందుకు మన్నించాలి. ఉదయం 7 దాటాక కూడా ఎక్కువ సమయం నిద్రపోయానంతే. నేను మరణించలేదు’’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశాడు పరేష్ రావల్. ఇలా సెలబ్రెటీలు చనిపోయినట్లు వార్తలు పుట్టించి పైశాచిక ఆనందం పొందే వారి గురించి ఎలా స్పందించాలో అర్థం కాదు. ఇలాంటి ప్రచారాలు సాగించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మిగతా వాళ్లు ఇలాంటి పనుల జోలికి వెళ్లరు.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

58 minutes ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

6 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

8 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

8 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

10 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

12 hours ago