దేశంలో కొవిడ్ కల్లోలం రేపుతున్నప్పటికీ ఓ భారీ చిత్రం ప్రేక్షకులను పలకరించింది. గురువారం సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. దేశంలో లాక్ డౌన్ షరతుల్లేని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ‘రాధె’ను థియేటర్లలో రిలీజ్ చేశారు. వాటి ద్వారా వచ్చిన వసూళ్లు నామమాత్రం. ఇక విదేశీ మార్కెట్లలో అవకాశం ఉన్న చోట భారీగానే సినిమాను రిలీజ్ చేశారు.
ఐతే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం ప్రతికూలం అయింది. తొలి రోజు ‘రాధె’ విదేశీ మార్కెట్ల నుంచి రూ.5 కోట్ల మేర మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు అంచనా. విదేశాల్లోనూ కొవిడ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ వసూళ్లు మరీ తక్కువ కాదని.. పర్వాలేదని అంటున్నారు. ఇక ఇండియాలో ఈ సినిమా తొలి రోజు ఏ మేర కలెక్షన్లు రాబట్టిందన్నది ఆసక్తికరం.
జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది చూసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. ఈ మార్గంలో సినిమా తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయినట్లే. ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249.
42 లక్షల మంది తలో 249 రూపాయలు వెచ్చించారంటే వసూళ్లు 104 కోట్లకు పైగానే ఉండాలి. ఐతే తొలి రోజు ఉన్న ఊపు రెండో రోజుకు కచ్చితంగా ఉండదు. పైగా సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. మరి రెండో రోజు వసూళ్ల సంగతేంటో చూడాలి. ఐతే రాధె టికెట్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయానికి తోడు జీ వాళ్లకు పెద్ద ప్రయోజనమే కలిగింది ‘రాధె’ ద్వారా. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు తోడు కొత్తవాళ్లు ‘రాధె’ కోసం ‘జీ’ ఓటీటీలను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రాధెతో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్స్క్రిప్షన్ 499కి అందించింది జీ. ఈ ఆఫర్ వాడుకున్న వాళ్లు లక్షల్లోనే ఉంటారు. కాబట్టి ఆ రకంగా కూడా ‘జీ’కు భారీగానే ఆదాయం సమకూరి ఉంటుంది.
This post was last modified on May 15, 2021 3:52 pm
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు.. బుధవారం ఉదయం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా…
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…