కొందరు వ్యక్తుల మంచితనం వాళ్లు ఉన్నప్పటి కంటే వెళ్లిపోయాక జనాలకు బాగా అర్థమవుతుంటుంది. వాళ్లు లేని లోటును అందరూ ఫీలవుతారు. జర్నలిస్ట్ టర్న్డ్ యాక్టర్ తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ ఇందుకు ఉదాహరణ. యూట్యూబ్లో ఇంటర్వ్యూల ద్వారా పేరు తెచ్చుకుని, ఆ పేరుతో సినిమాల్లో నటుడిగానూ అవకాశాలు అందుకుని గత కొన్నేళ్లలో సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యారు టీఎన్ఆర్.
కొవిడ్ గురించి అందరిలోనూ అవగాహన పెంపొందించే ప్రయత్నం చేసిన ఆయన.. ఇప్పుడు ఆ మహమ్మారికే బలైపోయారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటికి రాగానే సామాజిక మాధ్యమాల్లో టీఎన్ఆర్ సన్నిహితులు, పరిచయస్తులతో పాటు వేలాదిగా నెటిజన్లు స్పందించిన తీరు ఆయనకున్న మంచి పేరును చాటిచెబుతుంది. టీఎన్ఆర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో అందరికీ కన్నీళ్లు తెప్పించింది.
టీఎన్ఆర్ మరణం నేపథ్యంలో ఆయన ప్రస్థానాన్ని అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు. తన ఇంటర్వ్యూలకు వచ్చిన అతిథులకు సాగిలపడకుండా, అలాగే కించపరచకుండా,ఎంతో హుందాగా టీఎన్ఆర్ చేసే ఇంటర్వ్యూల గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. నటుడిగా ఆయన చేసిన పాత్రల మాట్లాడుకుంటున్నారు. ఐతే టీఎన్ఆర్ పాపులర్ అయ్యాక ఇంటర్వ్యూయర్, నటుడిగా అందరి దృష్టిలో పడ్డారు. కానీ ఆయనలో జనాలు చూడని కోణాలు కొన్ని ఉన్నాయి. నిజానికి దర్శకుడవ్వాలన్న కోరికతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ దగ్గర ఆయన ముందుగా అసిస్టెంటుగా చేరారు.
‘హిట్లర్’తో పాటు పలు చిత్రాల రచనలోనూ టీఎన్ఆర్ పాలు పంచుకున్న సంగతి చాలామందికి తెలియదు. ‘పిట్టలదొర’ సినిమాకు ఆయన సహాయ దర్శకుడిగా పని చేయడం విశేషం. తర్వాత బుల్లితెరపై దృష్టిపెట్టారు. పలు ఛానెళ్లలో పలు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. ఈటీవీలో బాగా పాపులర్ అయిన ‘నేరాలు ఘోరాలు’ క్రైమ్ ప్రోగ్రాంకు నాలుగేళ్ల పాటు టీఎన్ఆర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆపై యూట్యూబ్ ఛానెళ్ల హవా మొదలయ్యాక ఐడ్రీమ్కు ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. వినూత్న శైలితో సుదీర్ఘ ఇంటర్వ్యూలు చేయడంతో ఆయన పాపులర్ అయ్యారు. తర్వాత కథ అందరికీ తెలిసిందే.
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…