కొందరు వ్యక్తుల మంచితనం వాళ్లు ఉన్నప్పటి కంటే వెళ్లిపోయాక జనాలకు బాగా అర్థమవుతుంటుంది. వాళ్లు లేని లోటును అందరూ ఫీలవుతారు. జర్నలిస్ట్ టర్న్డ్ యాక్టర్ తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ ఇందుకు ఉదాహరణ. యూట్యూబ్లో ఇంటర్వ్యూల ద్వారా పేరు తెచ్చుకుని, ఆ పేరుతో సినిమాల్లో నటుడిగానూ అవకాశాలు అందుకుని గత కొన్నేళ్లలో సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యారు టీఎన్ఆర్.
కొవిడ్ గురించి అందరిలోనూ అవగాహన పెంపొందించే ప్రయత్నం చేసిన ఆయన.. ఇప్పుడు ఆ మహమ్మారికే బలైపోయారు. సోమవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటికి రాగానే సామాజిక మాధ్యమాల్లో టీఎన్ఆర్ సన్నిహితులు, పరిచయస్తులతో పాటు వేలాదిగా నెటిజన్లు స్పందించిన తీరు ఆయనకున్న మంచి పేరును చాటిచెబుతుంది. టీఎన్ఆర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో అందరికీ కన్నీళ్లు తెప్పించింది.
టీఎన్ఆర్ మరణం నేపథ్యంలో ఆయన ప్రస్థానాన్ని అందరూ గుర్తు తెచ్చుకుంటున్నారు. తన ఇంటర్వ్యూలకు వచ్చిన అతిథులకు సాగిలపడకుండా, అలాగే కించపరచకుండా,ఎంతో హుందాగా టీఎన్ఆర్ చేసే ఇంటర్వ్యూల గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. నటుడిగా ఆయన చేసిన పాత్రల మాట్లాడుకుంటున్నారు. ఐతే టీఎన్ఆర్ పాపులర్ అయ్యాక ఇంటర్వ్యూయర్, నటుడిగా అందరి దృష్టిలో పడ్డారు. కానీ ఆయనలో జనాలు చూడని కోణాలు కొన్ని ఉన్నాయి. నిజానికి దర్శకుడవ్వాలన్న కోరికతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ దగ్గర ఆయన ముందుగా అసిస్టెంటుగా చేరారు.
‘హిట్లర్’తో పాటు పలు చిత్రాల రచనలోనూ టీఎన్ఆర్ పాలు పంచుకున్న సంగతి చాలామందికి తెలియదు. ‘పిట్టలదొర’ సినిమాకు ఆయన సహాయ దర్శకుడిగా పని చేయడం విశేషం. తర్వాత బుల్లితెరపై దృష్టిపెట్టారు. పలు ఛానెళ్లలో పలు రకాల బాధ్యతలు నిర్వర్తించారు. ఈటీవీలో బాగా పాపులర్ అయిన ‘నేరాలు ఘోరాలు’ క్రైమ్ ప్రోగ్రాంకు నాలుగేళ్ల పాటు టీఎన్ఆర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆపై యూట్యూబ్ ఛానెళ్ల హవా మొదలయ్యాక ఐడ్రీమ్కు ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. వినూత్న శైలితో సుదీర్ఘ ఇంటర్వ్యూలు చేయడంతో ఆయన పాపులర్ అయ్యారు. తర్వాత కథ అందరికీ తెలిసిందే.
This post was last modified on May 11, 2021 7:27 pm
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…