సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లకు హ్యాకింగ్ బెడద ఎప్పుడూ పొంచే ఉంటుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లతో పాటు యూట్యూబ్ ఛానెళ్లను సైతం హ్యాక్ చేసి సెలబ్రెటీలను బెదిరించే హ్యాకర్లు చాలామందే తయారయ్యారు. తాజాగా మంచు లక్ష్మీప్రసన్న యూట్యూబ్ ఛానెల్ను ఎవరో హ్యాక్ చేశారు. ఆమె ‘చిట్టి చిలకమ్మ’ పేరుతో కొంత కాలం కిందట యూట్యూబ్ ఛానెల్ పెట్టడం.. అందులో పిల్లలకు ఆసక్తికర పాఠాలు బోధిస్తుండటం తెలిసిన సంగతే.
ఐతే ఇప్పుడా యూట్యూబ్ ఛానెల్ను ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా లక్ష్మి వెల్లడించింది. తన ఛానెల్ నుంచి ఏదైనా అర్థరహితమైన కంటెంట్ వస్తే దాన్ని పట్టించుకోవద్దని లక్ష్మి తన ఫాలోవర్లకు సూచించింది. ఛానెల్ను పునరుద్ధరించేందుకు తన టీం ప్రయత్నిస్తోందని.. త్వరలోనే ఛానెల్ తిరిగి తన చేతికి వస్తుందని లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేసింది.
చిట్టి చిలకమ్మ యూట్యూబ్ ఛానెల్లో తన కూతురు విద్యా నిర్వాణ మీద తీసిన వీడియోలను పోస్ట్ చేస్తూ లక్ష్మి జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల పెంపకం, వారికి చదువు చెప్పించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులను చక్కగా ఆమె వివరిస్తూ వస్తోంది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. లక్ష్మికి దీని ద్వారా మంచి ప్రశంసలు దక్కాయి. త్వరలోనే ఈ ఛానెల్ లక్ష్మి చేతికి వస్తుందేమో చూడాలి.
ఇక మంచు లక్ష్మి కెరీర్ విషయానికి వస్తే ఆమె సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నట్లే ఉంది. చివరగా ఆమె ‘వైఫ్ ఆఫ్ రామ్’తో పలకరించింది. అది మంచి ప్రయత్నమే అయినా సరైన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఇటీవల నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ‘పిట్టకథలు’ వెబ్ ఫిలింలో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ‘రాములా’ ఎపిసోడ్లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ వెబ్ ఫిలింలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది ‘రాములా’ సెగ్మెంటే.
This post was last modified on May 11, 2021 7:32 am
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…