తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్.. కరోనాకు తలొంచిన మరో మీడియా కమ్ సినీ ప్రముఖుడు. దర్శకుడవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎల్బీ శ్రీరాం దగ్గర కొన్నాళ్లు రచయితగా పని చేసి.. ఆ తర్వాత మీడియాలోకి వెళ్లి.. యూట్యూబ్లో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ కావడమే కాక నటుడిగా అవకాశాలు అందుకుని.. బిజీ అయిన వ్యక్తి టీఎన్ఆర్.
కరోనా గురించి, దాని బాధితుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎంతోమందిని జాగృతం చేసిన టీఎన్ఆర్ చివరికి ఆ కరోనాకే బలైపోయారు. నెల కిందట తనకు అమ్మ లాంటి ఓ వ్యక్తి కరోనా బారిన పడి ప్రాణాల కోసం పోరాడుతోందని, ఆమె కోసం ప్రార్థించాలని ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టారాయన. ప్రముఖులనే కాక.. మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కని వారిని ఇంటర్వ్యూలు చేయడం, పోస్టులు పెట్టడం ద్వారా చిన్న సినిమాలకు ఎంతగానో ప్రోత్సాహం అందించిన మంచి వ్యక్తి టీఎన్ఆర్.
కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడి ఇంటి దగ్గరే మందులేసుకుంటూ ఉల్లాసంగానే కనిపించారు టీఎన్ఆర్. తన పరిస్థితి విషమించి ఆసుపత్రి పాలవడానికి ముందు ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో మంచి సూచనలు చేశారు. తాను కరోనా బారిన పడ్డప్పటికీ.. చాలా ఆరోగ్యంగానే ఉన్నానని, ఏ ఇబ్బందీ లేదని.. మంచి పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ ఉల్లాసంగా గడుపుతున్నానని చెప్పారు. చెడులోనూ మంచిని వెతుక్కోమని పెద్దలు అంటుంటారని.. తాను కూడా ఈ ఖాళీ సమయంలో ప్రాణాయామం, యోగా చేయగలుగుతున్నానని అన్నారు.
కరోనా బారిన పడ్డ వారు ఎక్కువ టెన్షన్ పడకుండా, టీవీల్లో నెగెటివ్ న్యూస్ చూడకుండా ప్రశాంతంగా ఉండాలని.. అలా చేస్తే కరోనా ఎవరినీ ఏమీ చేయదని, సులువుగానే కోలుకుంటారని ఆయన హితవు పలికారు. అలాగే పిల్లలకు మంచి మాటలు చెప్పి, వాళ్లంతట వాళ్లు కొత్త విషయాలు తెలుసుకునేలా శిక్షణ ఇవ్వాలని పెద్దలకు సూచించారు. నాలుగు రోజుల కిందట ఇలా వీడియోలో మంచి మాటలు చెప్పి ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి ఇలా ఉన్నట్లుండి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం.
This post was last modified on May 10, 2021 4:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…