టాలీవుడ్కు సంబంధించి సినిమాలకు ది బెస్ట్ సీజన్ అంటే వేసవే. సంక్రాంతి, దసరా లాంటి సీజన్లు కూడా బాగానే కలిసొస్తాయి కానీ.. అప్పుడు సెలవులుండేది వారం పది రోజులే. అవి షార్ట్ సీజన్స్. కానీ వేసవి అలా కాదు. మార్చి నెలాఖర్లో మొదలుపెడితే.. జూన్ మధ్య వరకు రెండు మూడు నెలల పాటు సినిమాలకు బ్రహ్మాండంగా కలిసొస్తుంటుంది. విద్యార్థులందరికీ దశల వారీగా సెలవులుంటాయి. వాళ్లు థియేటర్ల మీద దండయాత్ర చేస్తుంటారు. మిగతా ప్రేక్షకులు సినిమాలు చూడటానికి బాగా ఉత్సాహం చూపిస్తుంటారు వేసవిలో. అందుకే ప్రతి ఏడాదీ వేసవికి భారీ చిత్రాలు వరుస కడుతుంటాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు భారీ వసూళ్లు వస్తుంటాయి.
ఐతే ఎప్పుడూ కొత్త సినిమాలతో కళకళలాడే వేసవి సీజన్.. గత ఏడాది కరోనా కారణంగా వెలవెలబోయింది. థియేటర్లు పూర్తిగా మూతబడిపోవడంతో బంగారం లాంటి సీజన్ వృథా అయిపోయింది. ముందు థియేటర్లకు గ్రహణం కొన్ని రోజులకే అనుకున్నారు. కానీ నెలలకు నెలలు అది కొనసాగింది. వేసవి మొత్తం ఎదురు చూపులే సరిపోయాయి. థియేటర్లు తెరుచుకోనే లేదు. గత ఏడాది చివరికి కానీ మళ్లీ థియేటర్లలో కళ రాలేదు. ఐతే థియేటర్ల పున:ప్రారంభం తర్వాత మళ్లీ త్వరగానే సందడి కనిపించడంతో అయ్యిందేదో అయ్యిందని.. గత ఏడాది నష్టపోయిందంతా ఈసారి వేసవిలో భర్తీ చేసుకుందామని సినీ పరిశ్రమ భారీ ప్రణాళికలతో సిద్ధమైంది. ఎన్నో క్రేజీ సినిమాలు వేసవి బరిలో నిలిచాయి.
కానీ కరోనా సెకండ్ వేవ్ ఈ వేసవిని కూడా దెబ్బ కొట్టింది. గత నెలలో కరోనా ఉద్ధృతి పెరగడంతో వరుసగా సినిమాలు వాయిదా పడ్డాయి. మేలో పరిస్థితులు బాగు పడతాయని అనుకుంటే.. ఈ నెలలో పరిస్థితులు మరింత దుర్భరంగా తయారయ్యాయి. థియేటర్లలో సినిమాల గురించి అసలు ఆలోచించే పరిస్థితే కనిపించడం లేదు. మే మీద ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. జూన్ నెలలో కూడా పరిస్థితులు మెరుగవుతాయా.. కొత్త సినిమాలు రిలీజవుతాయా అన్నది సందేహంగానే ఉంది. మొత్తంగా చూస్తే మరోసారి వేసవి పూర్తిగా వేస్ట్ అయ్యేట్లే కనిపిస్తోంది. జులైకైనా థియేటర్లు మునుపటిలా నడిచి కొత్త సినిమాలు నడిస్తే గొప్ప అన్నట్లే ఉంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…