నెల ముందు వరకు త్రివిక్రమ్ తర్వాతి సినిమా.. జూనియర్ ఎన్టీఆర్తోనే అనుకుంటూ వచ్చారు అందరూ. ‘జెర్సీ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన నిర్మాత నాగవంశీ.. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయింది. ఎన్టీఆరేమో కొరటాల శివతో సినిమాను అనౌన్స్ చేశాడు. కొంచెం గ్యాప్ ఇచ్చి త్రివిక్రమ్.. మహేష్ సినిమా గురించి ప్రకటించాడు. అసలు ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివ.. ఎన్టీఆర్ కోసం ఇంకా కథ రెడీ చేయలేదనే అంటున్నారు.
అలాగే మహేష్ సినిమాకు త్రివిక్రమ్ కూడా స్క్రిప్టు పూర్తి చేయలేదనే అంటున్నారు. ఈ నెల 31న కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాకు ప్రారంభోత్సవం జరపనున్నట్లు చెబుతున్నారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలవడానికి మాత్రం కొంచెం సమయం పట్టేట్లే ఉంది. ఎందుకంటే ఇంకా ఈ సినిమాకు స్క్రిప్టు రెడీ కాలేదన్న చిత్ర వర్గాల సమాచారం. ఐతే మీడియాలో మాత్రం అప్పుడే ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ ఖరారైపోయినట్లుగా చెబుతుండటం విశేషం.
పార్థు అనగానే మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’ మహేష్ పాత్ర గుర్తుకొస్తుంది. ఆ సినిమాతో పార్థు అనే పేరుకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు వీరి కలయికలో సినిమా అనేసరికి సరదాగా ఈ టైటిల్ను ప్రచారంలోకి తెస్తున్నారో ఏమో తెలియదు. త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే సమయానికి టైటిల్ ఖరారు చేయడం అరుదు. సగం చిత్రీకరణ అయ్యాక నెమ్మదిగా టైటిల్ అనౌన్స్ చేస్తుంటాడు. అలాంటిది ఇంకా స్క్రిప్టు రెడీ కాని, మొదలుకాని సినిమాకు ఇప్పుడే టైటిల్ పెట్టేసి మీడియాకు లీక్ చేస్తాడా అన్నది డౌటు.
This post was last modified on May 6, 2021 7:10 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…