పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం ‘పింక్’ రీమేక్ను ఎంచుకుంటున్నాడన్న వార్త అప్పట్లో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో పవన్ నటించడమేంటన్నది వారి అభ్యంతరం. అదే నిరాశ కలిగించే విషయం అంటే.. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు అనగానే ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది అభిమానుల్లో. ఈ దర్శకుడి తొలి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్’ పెద్ద డిజాస్టర్. రెండో సినిమా ‘ఎంసీఏ’ హిట్టయినా అందులో పెద్దగా దర్శకుడి ప్రతిభ కనిపించలేదు. అసలే రీమేక్.. పైగా వేణు దర్శకత్వమా అంటూ ఎద్దేవా చేశారు అభిమానులు. స్వయంగా పవన్ ఫ్యాన్సే వేణును ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. గూగుల్లో వెతికినా ఇతడి గురించి సమాచారం ఉండదు అంటూ ఎద్దేవా చేశారు అప్పట్లో. ఎక్కడ దొరుకుతారు నీకిలాంటి డైరెక్టర్లు అంటూ పవన్ను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు.
అలాంటిది గత కొన్ని రోజులుగా వేణు పట్ల పవన్ ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానం అంతా ఇంతా కాదు.‘వకీల్ సాబ్’ ప్రోమోలు మొదలైనప్పటి నుంచి వేణు మీద అభిప్రాయం మారుతూ వచ్చింది. ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టును పవన్ ఇమేజ్కు తగ్గట్లుగా మార్చి సినిమాలో హీరోయిజానికి, మాస్ అంశాలకు లోటు లేకుండా చూడటం పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. సినిమా రిలీజ్కు ముందే వేణు పట్ల వారికి ఆరాధన భావం వచ్చింది.
రిలీజ్ తర్వాత అయితే చెప్పాల్సిన పని లేదు. మంగళవారం వేణు పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద పవన్ అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటికే వేణుకు ‘మాస్ గాడ్’ అని బిరుదు ఇచ్చేయడం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా #HBDMASSGODVENUSRIRAM అని హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్లో. వేణుకు ఎలివేషన్లు ఇస్తూ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో దర్శకుడి ప్రతిభను చాటే సన్నివేశాలతో ట్వీట్లు గుప్పిస్తున్నారు. హరీష్ శంకర్ తర్వాత ఒక అభిమాని తన ఆరాధ్య కథానాయకుడితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో వేణు చూపించాడంటూ అతణ్ని కొనియాడుతున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…