సినీ పరిశ్రమ మరోసారి సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. సినిమాల షూటింగ్లన్నీ ఆగిపోతున్నాయి. థియేటర్లు మూతపడిపోయాయి. కొత్త సినిమాలు విడుదల లేదు. నిర్మాతలకు ఆదాయం లేదు. కార్మికులకు ఉపాధి లేదు. అదే సమయంలో కరోనా కల్లోల సమయంలో కాస్త ఉపశమనం పొందుదాం అనుకుంటే ప్రేక్షకులకు సరైన వినోదమూ లేదు. కరోనా బారిన పడ్డ వాళ్లు సైతం తీవ్ర లక్షణాలు లేకుంటే ఇంటిపట్టున ఉంటున్నపుడు ఏదో ఒక కొత్త సినిమానో చూడాలనే కోరుకుంటారు. ఇక మామూలు ప్రేక్షకుల సంగతి సరేసరి. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఎప్పుడూ వేచి చూస్తూనే ఉంటారు. కానీ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అసలు థియేటర్లు ఎక్కడా నడవట్లేదు కూడా. అలాంటపుడు ఓటీటీల్లో కొత్త కంటెంట్ కోసం చూస్తారు. కానీ అక్కడా సరిపడా వినోదం లేకపోయె.
గత ఏడాది లాక్ డౌన్ పెట్టిన కొన్ని నెలలకు.. థియేటర్లు త్వరలో తెరుచుకునే అవకాశం లేదని తేలాక నేరుగా కొత్త చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ముందు చిన్న సినిమాలొచ్చాయి. తర్వాత పెద్దవి కూడా రిలీజ్ చేశారు. కానీ ప్రస్తుత సెకండ్ వేవ్ విజృంభణతో అన్ని సినీ పరిశ్రమల్లోనూ స్తబ్దత నెలకొనగా.. కొత్త సినిమాను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసే విషయంలో అంత సుముఖతతో కనిపించడం లేదు నిర్మాతలు. హిందీలో ఒక్క ‘రాధె’ మాత్రమే ఈ నెల 13న ఓటీటీలు, డీటీహెచ్ల ద్వారా నేరుగా రిలీజవుతోంది. దాన్ని థియేటర్లలోనూ రిలీజ్ చేస్తామంటున్నారు కానీ.. అది నామమాత్రమే. ఇంకే పేరున్న సినిమా కూడా రాబోయే రోజుల్లో రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు.
తెలుగులో అయితే అనసూయ సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్’ మాత్రమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కు రెడీ అయింది. లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాటపర్వం లాంటి విడుదలకు సిద్ధంగా ఉన్న పేరున్న సినిమాలు ఓటీటీల బాట పట్టే సంకేతాలు ఎంతమాత్రం లేవు. ఇష్క్, ఏక్ మిని ప్రేమకథ లాంటి చిన్న చిత్రాల మేకర్స్ సైతం ఆ దిశగా ఆసక్తి చూపించట్లేదు. వచ్చే నెల రోజుల్లో అయితే పరిస్థితులు మెరుగుపడతాయన్న సంకేతాలే కనిపించడం లేదు. మళ్లీ థియేటర్లు మునుపటిలా ఎప్పుడు నడుస్తాయో తెలియట్లేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల పరిస్థితి రెంటికీ చెడ్డట్లు తయారైంది. మరి వారి ఆకలి తీర్చేదెవరో?
This post was last modified on May 4, 2021 7:06 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…