Political News

ఈ లెక్కన చిరంజీవి అందరి కంటే గ్రేటే

సినీ తారలను వెర్రిగా ఆరాధించే అభిమానులు.. ఆ తారలు రాజకీయాల్లోకి వస్తే అంతే స్థాయిలో ఆదరిస్తారని.. తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారని గ్యారెంటీ లేదు. ఇండియాలో రాను రానూ సినీ తారల రాజకీయం మసకబారిపోతోంది. సినిమా వాళ్లు సభలు పెడితే వాళ్లను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న జనం.. తర్వాత వాళ్ల కోసం అదే స్థాయిలో పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు మాత్రం వేయట్లేదన్నది స్పష్టం. తాజాగా ఈ విషయం తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్ విషయంలోనూ రుజువైంది. ఆయన ఆదర్శ భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేశారు. జనాల్ని చైతన్య వంతులను చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఏం లాభం ఆయనతో పాటు పార్టీకి ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయం సున్నా చుట్టేసింది.

కమల్ లాగే పార్టీ పెట్టాలనుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆరోగ్య కారణాలు చెప్పి రాజకీయాల్లోకి రాకుండానే నిష్క్రమించారు. ఆయన నిర్ణయాన్ని ఇప్పుడందరూ కొనియాడుతున్నారు. చాలా మంచి నిర్ణయం అంటున్నారు. రజినీ రంగంలోకి దిగి ఉన్నా ఇంతకంటే భిన్నమైన ఫలితం రాబట్టే వారా అన్నది సందేహమే. ఇక తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయం విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని గత పర్యాయం ఎన్నికల బరిలో నిలిపితే.. ఒకే ఒక అసెంబ్లీ స్థానం దక్కింది. చివరికి ఆ నాయకుడు కూడా జెండా తిప్పేసి వెళ్లిపోయాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన పోరాడుతున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల సమయానికి ఏమాత్రం పుంజుకుంటాడో సందేహంగానే ఉంది. ఇదీ వర్తమానంలో సినీ రాజకీయ నాయకుల పరిస్థితి.

ఐతే పుష్కర కాలం వెనక్కి వెళ్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలు సాధించారు. అధికారం చేపట్టలేకపోవడం, 18 స్థానాలకు పరిమితం కావడాన్ని అప్పుడాయన పరాభవంగా భావించారు. కానీ ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే చిరు అప్పుడు గొప్ప ఫలితాలు రాబట్టినట్లే. ఆయనకు కొంచెం ఓపిక, పట్టుదల ఉండి పార్టీని కొనసాగించి ఉంటే ఇప్పుడు రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి అయ్యేవారేమో. కానీ ఆయన రెండేళ్లు తిరిగేసరికి బోర్డు తిప్పేశారు. తన రాజకీయ జీవితానికి తనే చరమగీతం పాడేసుకున్నారు. ఆ ప్రభావం తర్వాత తమ్ముడి మీదా పడింది. చిరు చేసిన పనికి ఆయన తమ్ముడిని కూడా జనాలు నమ్మడం మానేశారు. ఇప్పుడు తమిళనాట కూడా సినీ రాజకీయ నాయకుల్ని జనాలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.

This post was last modified on May 4, 2021 7:08 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

3 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

29 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

41 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago