Chiranjeevi
సినీ తారలను వెర్రిగా ఆరాధించే అభిమానులు.. ఆ తారలు రాజకీయాల్లోకి వస్తే అంతే స్థాయిలో ఆదరిస్తారని.. తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారని గ్యారెంటీ లేదు. ఇండియాలో రాను రానూ సినీ తారల రాజకీయం మసకబారిపోతోంది. సినిమా వాళ్లు సభలు పెడితే వాళ్లను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న జనం.. తర్వాత వాళ్ల కోసం అదే స్థాయిలో పోలింగ్ బూత్లకు వెళ్లి ఓట్లు మాత్రం వేయట్లేదన్నది స్పష్టం. తాజాగా ఈ విషయం తమిళ లెజెండరీ నటుడు కమల్ హాసన్ విషయంలోనూ రుజువైంది. ఆయన ఆదర్శ భావాలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేశారు. జనాల్ని చైతన్య వంతులను చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఏం లాభం ఆయనతో పాటు పార్టీకి ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయం సున్నా చుట్టేసింది.
కమల్ లాగే పార్టీ పెట్టాలనుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆరోగ్య కారణాలు చెప్పి రాజకీయాల్లోకి రాకుండానే నిష్క్రమించారు. ఆయన నిర్ణయాన్ని ఇప్పుడందరూ కొనియాడుతున్నారు. చాలా మంచి నిర్ణయం అంటున్నారు. రజినీ రంగంలోకి దిగి ఉన్నా ఇంతకంటే భిన్నమైన ఫలితం రాబట్టే వారా అన్నది సందేహమే. ఇక తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయం విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని గత పర్యాయం ఎన్నికల బరిలో నిలిపితే.. ఒకే ఒక అసెంబ్లీ స్థానం దక్కింది. చివరికి ఆ నాయకుడు కూడా జెండా తిప్పేసి వెళ్లిపోయాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన పోరాడుతున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల సమయానికి ఏమాత్రం పుంజుకుంటాడో సందేహంగానే ఉంది. ఇదీ వర్తమానంలో సినీ రాజకీయ నాయకుల పరిస్థితి.
ఐతే పుష్కర కాలం వెనక్కి వెళ్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలు సాధించారు. అధికారం చేపట్టలేకపోవడం, 18 స్థానాలకు పరిమితం కావడాన్ని అప్పుడాయన పరాభవంగా భావించారు. కానీ ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే చిరు అప్పుడు గొప్ప ఫలితాలు రాబట్టినట్లే. ఆయనకు కొంచెం ఓపిక, పట్టుదల ఉండి పార్టీని కొనసాగించి ఉంటే ఇప్పుడు రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి అయ్యేవారేమో. కానీ ఆయన రెండేళ్లు తిరిగేసరికి బోర్డు తిప్పేశారు. తన రాజకీయ జీవితానికి తనే చరమగీతం పాడేసుకున్నారు. ఆ ప్రభావం తర్వాత తమ్ముడి మీదా పడింది. చిరు చేసిన పనికి ఆయన తమ్ముడిని కూడా జనాలు నమ్మడం మానేశారు. ఇప్పుడు తమిళనాట కూడా సినీ రాజకీయ నాయకుల్ని జనాలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…