గత నెలలో థియేటర్లను కళకళలాడించిన సినిమా ‘వకీల్ సాబ్’. గత ఏడాది కాలంలో అలాంటి సందడిని ఎప్పుడూ చూడలేదు తెలుగు ప్రేక్షకులు. కరోనా ధాటికి ఏడాదికి పైగా పెద్ద సినిమాల సందడి లేక అందరూ ఒక నైరాశ్యంలో ఉండగా.. ఈ సినిమా వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. కానీ ఈ సినిమాతోనే థియేటర్ల వైభవానికి తెరపడటం విచారకరం. కరోనా సెకండ్ వేవ్ ధాటికి థియేటర్లను మూత వేయక తప్పలేదు. కరోనా లేకుంటే ‘వకీల్ సాబ్’ థియేటర్లలో ఇంకా కొన్ని రోజులు బాగా ఆడేదేమో.
ఐతే ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ రన్కు త్వరగా తెరపడ్డప్పటికీ.. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ బాట పట్టడంతో ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమాలన్నీ ‘వకీల్ సాబ్’ ముచ్చట్లతో నిండిపోతున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వాళ్లతో పాటు ఆల్రెడీ థియేటర్లలో చూసిన వాళ్లు కూడా విరగబడి ‘అమేజాన్ ప్రైమ్’లో ఈ సినిమాను చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
మామూలుగా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్న సినిమాలకు రిపీట్ ఆడియన్స్ వస్తుంటారు. ‘వకీల్ సాబ్’ను కూడా తొలి రెండు వారాల్లో అలా అభిమానులు మళ్లీ మళ్లీ చూశారు. ఐతే ఈ సినిమాకు సెకండ్ వీకెండ్ అయ్యేసరికే కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. ఐతే ఇప్పుడు అమేజాన్ ప్రైమ్లో ఫ్యాన్స్ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను బాగా ఆస్వాదిస్తున్నారు.
సూపర్ ఉమన్ సీన్తో పాటు విజిల్ వర్తీ అనిపించే కొన్ని సన్నివేశాలను మళ్లీ మళ్లీ చూసి సోషల్ మీడియాలో ముచ్చట్లు పెడుతున్నారు. సినిమా రిలీజైనపుడు ఎలా అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ను ఆకాశానికెత్తేశారో.. ఇప్పుడు అదే స్థాయిలో అతణ్ని కొనియాడుతున్నారు. ఫలానా సీన్లో బీజీఎం అంటూ.. ఇబ్బడిముబ్బడిగా ట్వీట్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ ‘వకీల్ సాబ్’కు పట్టం కడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రైమ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా ‘వకీల్ సాబ్’ రికార్డుల్లోకి ఎక్కే అవకాశాలు లేకపోలేదు.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…