తమిళ స్టార్ హీరో అజిత్కు ఒక దర్శకుడు నచ్చితే వరుసగా అతడితో సినిమాలు చేసేస్తుంటాడు. ఇంతకుముందు ‘శౌర్య’ శివతో ఇలాగే నాలుగు సినిమాలు చేసేశాడు. ‘వీరం’తో వీళ్లిద్దరూ తొలిసారి జోడీ కట్టారు. అది సూపర్ హిట్టయింది. వీరి కలయికలో వచ్చిన రెండో సినిమా ‘వేదాళం’ సైతం సూపర్ హిట్టే. దీంతో మళ్లీ ఈ జంట కలిసి ‘వివేగం’ చేసింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా.. అజిత్ తగ్గలేదు. శివతో మళ్లీ ‘విశ్వాసం’ చేశాడు. అది బ్లాక్బస్టర్ అయింది.
అక్కడ కట్ చేస్తే.. శివ నుంచి బ్రేక్ తీసుకున్నాక అజిత్ హెచ్.వినోద్ అనే యువ దర్శకుడితో జట్టు కట్టాడు. శతురంగ వేట్టై, ఖాకి చిత్రాలతో వినోద్ మంచి పేరే సంపాదించాడు. అతడితో ‘పింక్’ రీమేక్ ‘నీర్కెండ పార్వై’ చేశాడు అజిత్. ఆ సినిమా బాగా ఆడింది. దీంతో వెంటనే వినోద్ సొంత కథతో ఓ సినిమా మొదలుపెట్టాడు. అదే.. వాలిమై. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందిప్పుడు.
ఈ సినిమా ఈ ఏడాదే ఏదో ఒక సమయంలో విడుదలవుతుందని ఆశిస్తున్నారు. ఐతే ఈలోపే వినోద్తో మరో సినిమా లైన్లో పెట్టేశాడట అజిత్. వీరి కలయికలో హ్యాట్రిక్ మూవీ వచ్చే ఏఢాది మొదలవుతుందట. నీర్కొండ పార్వై, వాలిమై చిత్రాల నిర్మాత బోనీ కపూరే మళ్లీ ఈ ఇద్దరితో కలిసి సినిమా చేయబోతున్నాడట.
ఐతే ఈ సినిమా మొదలు కావడానికి ముందు అజిత్ మధ్యలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించబోయేది తెలుగమ్మాయి అయిన సుధ కొంగర కావడం విశేషం. సూర్యతో ఆమె తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ మంచి ఫలితాన్నందుకోవడంతో తనతో సినిమా చేయడానికి అజిత్ ముందుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. అజిత్తో ఈ సినిమా పూర్తి చేశాక మహేష్ బాబుతో ఓ చిత్రం చేయడానికి సుధ ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…