Movie News

తన సినిమా రిలీజ్.. హీరోకు నచ్చట్లేదా?

తమిళ స్టార్ హీరో ధనుష్.. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘జగమే తంత్రం’ ఏడాది కిందటే పూర్తయినా ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. గత ఏడాది లాక్‌డౌన్ మొదలయ్యాక.. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూశారు. థియేటర్లు పున:ప్రారంభమయ్యాకేమో నిర్మాత శశికాంత్ సైలెంటుగా ఉండిపోయాడు.

కొన్ని రోజులకు ‘జగమే తంత్రం’ను నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడానికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. దీని పట్ల ధనుష్ అభిమానులు అప్పట్లో భగ్గుమన్నారు. థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు.ఈ విషయంలో ధనుష్ మీద కూడా వాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో అతను ‘జగమే తంత్రం’ ఓటీటీ రిలీజ్‌పై స్పందించక తప్పలేదు. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలన్నదే తన అభిమతమని, అలాగే జరగాలని కోరుకుందామని ఒక ట్వీట్ వేసి వదిలిపెట్టాడు.

‘జగమే తంత్రం’కు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం ధనుష్‌కు నచ్చలేదని అప్పుడే తేలిపోయింది. ఐతే జరిగిందేదో జరిగిపోయిందని.. సినిమా విడుదలపై తుది నిర్ణయం నిర్మాతదే కదా అని అతను సర్దుకుపోతాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాగాజా ‘జగమే తంత్రం’ రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 18న ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్‌లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. దీని గురించి నిర్మాతే కాక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సైతం ట్వీట్ వేశాడు.

కానీ ధనుష్ ఆ ట్వీట్లను రీట్వీట్ చేయడం కానీ.. సొంతంగా ట్వీట్ వేయడం కానీ.. ఇంకే రకంగానైనా స్పందించడం కానీ చేయలేదు. దీన్ని బట్టి ‘జగమే తంత్రం’ సినిమాతో అతను డిస్కనెక్ట్ అయిపోయాడని.. దర్శక నిర్మాతలతో టచ్‌లో లేడని స్పష్టమైపోయింది. ఇదిలా ఉంటే ధనుష్ నుంచి ఇటీవలే వచ్చిన ‘కర్ణన్’ థియేటర్లలో 50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనే చాలా బాగా ఆడింది. ఎప్పుడో పూర్తయిన ‘జగమే తంత్రం’ను చాలా ముందే థియేటర్లలోకి వదిలేయాల్సిందన్నది ధనుష్, అతడి అభిమానుల అభిప్రాయం.

This post was last modified on April 28, 2021 9:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago