తమిళ స్టార్ హీరో ధనుష్.. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘జగమే తంత్రం’ ఏడాది కిందటే పూర్తయినా ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. గత ఏడాది లాక్డౌన్ మొదలయ్యాక.. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూశారు. థియేటర్లు పున:ప్రారంభమయ్యాకేమో నిర్మాత శశికాంత్ సైలెంటుగా ఉండిపోయాడు.
కొన్ని రోజులకు ‘జగమే తంత్రం’ను నేరుగా నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. దీని పట్ల ధనుష్ అభిమానులు అప్పట్లో భగ్గుమన్నారు. థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు.ఈ విషయంలో ధనుష్ మీద కూడా వాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో అతను ‘జగమే తంత్రం’ ఓటీటీ రిలీజ్పై స్పందించక తప్పలేదు. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలన్నదే తన అభిమతమని, అలాగే జరగాలని కోరుకుందామని ఒక ట్వీట్ వేసి వదిలిపెట్టాడు.
‘జగమే తంత్రం’కు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం ధనుష్కు నచ్చలేదని అప్పుడే తేలిపోయింది. ఐతే జరిగిందేదో జరిగిపోయిందని.. సినిమా విడుదలపై తుది నిర్ణయం నిర్మాతదే కదా అని అతను సర్దుకుపోతాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాగాజా ‘జగమే తంత్రం’ రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 18న ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. దీని గురించి నిర్మాతే కాక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సైతం ట్వీట్ వేశాడు.
కానీ ధనుష్ ఆ ట్వీట్లను రీట్వీట్ చేయడం కానీ.. సొంతంగా ట్వీట్ వేయడం కానీ.. ఇంకే రకంగానైనా స్పందించడం కానీ చేయలేదు. దీన్ని బట్టి ‘జగమే తంత్రం’ సినిమాతో అతను డిస్కనెక్ట్ అయిపోయాడని.. దర్శక నిర్మాతలతో టచ్లో లేడని స్పష్టమైపోయింది. ఇదిలా ఉంటే ధనుష్ నుంచి ఇటీవలే వచ్చిన ‘కర్ణన్’ థియేటర్లలో 50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనే చాలా బాగా ఆడింది. ఎప్పుడో పూర్తయిన ‘జగమే తంత్రం’ను చాలా ముందే థియేటర్లలోకి వదిలేయాల్సిందన్నది ధనుష్, అతడి అభిమానుల అభిప్రాయం.
This post was last modified on April 28, 2021 9:25 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…