కరోనా విరామం తర్వాత తెలుగు నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్లలో ‘జాతిరత్నాలు’ ఒకటి. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి కామెడీ హీరోలను పెట్టి ‘పిట్టగోడ’ అనే ఫ్లాప్ సినిమా తీసిన అనుదీప్ రూపొందించిన చిత్రమిది. విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇక రిలీజ్ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. పెద్ద సినిమాల స్థాయిలో సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. సినిమా రెండు మూడు వారాల పాటు ఇరగాడేసింది. రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. థియేటర్లలో సినిమా చూసిన వాళ్లందరూ దీని గురించి పాజిటివ్గానే మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వించిన సినిమా లేదనే అన్నారు. కథా కథనాలు సిల్లీగానే ఉన్నప్పటికీ.. కామెడీకి ఢోకా లేదని, బాగా నవ్వుకున్నామనే అన్నారు చూసిన వాళ్లందరూ. రివ్యూలు కూడా పాజిటివ్గానే వచ్చాయి.
ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వాళ్లు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశారు. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకు అమేజాన్ ప్రైమ్లోకి వచ్చిందీ చిత్రం. కానీ ఓటీటీలో సినిమా చూసిన వాళ్లలో చాలామంది పెదవి విరుస్తున్నారు. ఇదేం సిల్లీ సినిమా రా నాయనా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటు ట్విట్టర్లో, అటు ఫేస్ బుక్లో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమా బాలేదంటూ ఒకరు పోస్ట్ పెడితే.. దాని కింద చాలామంది అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాకు అంత పెద్ద సక్సెస్ ఎలా ఇచ్చారంటూ ప్రేక్షకులను నిందిస్తున్నారు. ‘జాతిరత్నాలు’ టీం మీద కూడా విమర్శలు గుప్పించేస్తున్నారు.
ఐతే థియేటర్లలో సినిమా చూసిన వాళ్ల అభిప్రాయానికి, ఓటీటీలో చూస్తన్న వాళ్ల ఒపీనియన్కు ఇంత వైరుధ్యం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే కొన్ని సినిమాలు థియేటర్లలో చూస్తే కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. ‘జాతిరత్నాలు’ అలాంటి సినిమానే. థియేటర్లలో భారీ జనాల సందడి మధ్య ఈ సినిమా చూస్తున్నపుడు ఉన్న జోష్.. ఓటీటీలో ఒక్కరే కామ్గా చూస్తున్నపుడు ఉండదు. థియేటర్లలో లాజిక్కుల గురించి పట్టించుకోకుండా అందరితో కలిసి నవ్వేస్తాం. ఒక దశ దాటాక కథ ఎటు పోతోందన్న ఆలోచన కూడా కలగదు. కానీ ఓటీటీలో లాజిక్కులు వెతుక్కుంటూ.. ఈ సీన్ ఏంటి ఇంత సిల్లీగా ఉంది అనుకుంటూ చూడటం వల్ల తేడా కొడుతుండొచ్చు.
This post was last modified on April 26, 2021 2:42 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…