ఒక కాక్క కాక్క (తెలుగులో ఘర్షణ).. ఒక వేట్టయాడు విలయాడు (తెలుగులో రాఘవన్).. ఒక ఏమాయ చేసావె.. ఒక సూర్య సన్నాఫ్ కృష్ణన్ గౌతమ్ మీనన్ నుంచి వచ్చిన క్లాసిక్స్ లిస్టు ఇది.. ఆయన సినిమాల్లో కొన్ని కమర్షియల్గా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ.. అవి కూడా గొప్ప సినిమాలుగానే పేరు తెచ్చుకున్నాయి. దక్షిణాది నుంచి గత రెండు దశాబ్దాల్లో వచ్చిన మేటి దర్శకుల్లో అతను ఒకడు. దర్శకుడిగా తన పాటికి తాను సినిమాలు తీస్తున్నంత వరకు బాగానే ఉంది కానీ.. అతను ప్రొడక్షన్లోకి అడుగు పెట్టాక తేడా కొట్టేసింది.
గౌతమ్ నిర్మాణ సంస్థ ఫోటాన్ కథాస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని.. ఈ దర్శకుడి కెరీర్ను దారుణంగా దెబ్బ తీసేసింది. అతను దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలన్నీ వివాదాల్లో చిక్కుకున్నాయి. అందులో ధనుష్ హీరోగా చేసిన ఎన్నై నొక్కి పాయుం తోట సినిమా ఒకటి. అది అతి కష్టం మీద గత ఏడాది విడుదలైంది. కానీ ఫ్లాప్ అయింది.
విక్రమ్తో తీసిన ధ్రువనక్షత్రం అడ్రస్ లేదు. గౌతమ్ నిర్మాణంలో తెరకెక్కిన నరకాసురన్ కూడా బయటికి రాలేదు. వీటిని బయటికి తీసుకురాలేకపోగా.. కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ చేసే స్థితిలో గౌతమ్ లేడు. మధ్యలో జయలలిత మీద ఒక వెబ్ సిరీస్ తీశాడు. అది పక్కనపెడితే.. గౌతమ్ దగ్గర మంచి మంచి స్క్రిప్టులున్నాయి. అతను ఇప్పటికీ మంచి ఫామ్లోనే ఉన్నాడు. కానీ ఆర్థిక వివాదాల కారణంగా ఏ సినిమానూ డైరెక్ట్ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అతను ఖాళీగా ఉండలేక నటన వైపు అడుగులేశాడు.
మలయాళంలో చేసిన ట్రాన్స్తో మంచి పేరొచ్చింది. పావ కథైగల్ అనే యాంథాలజీ వెబ్ ఫిలింతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నటుడిగా అతను బిజీ అయిపోయాడు. దర్శకుడిగా తన నుంచి స్ఫూర్తి పొందిన వెట్రిమారన్ డైరెక్షన్లోనూ నటిస్తున్నాడు. కానీ గౌతమ్ నుంచి దర్శకుడిగా సినిమాలు ఆశిస్తున్న అభిమానులకు మాత్రం నిరాశ తప్పట్లేదు. మళ్లీ అతనెప్పుడు డైరెక్ట్ చేస్తాడో మరి.
This post was last modified on April 24, 2021 9:37 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…